లెజెండ్స్ అందరూ ఒకే చోట కలిశారు.. రానా షేర్ చేసిన అరుదైన ఫోటో ఇదే..!

ఒకే ఫోటోలో లెజెండ్స్ అందరూ కలిస్తే ఎలాగుంటుంది? నటుడు రానా, తన స్నేహితుడు అడివి శేష్‌తో అలాంటి ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్‌‌లో పంచుకోగా.. ఇప్పుడు అదే ఫోటో పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 

Last Updated : Jun 5, 2018, 01:32 PM IST
లెజెండ్స్ అందరూ ఒకే చోట కలిశారు.. రానా షేర్ చేసిన అరుదైన ఫోటో ఇదే..!

ఒకే ఫోటోలో లెజెండ్స్ అందరూ కలిస్తే ఎలాగుంటుంది? నటుడు రానా, తన స్నేహితుడు అడివి శేష్‌తో అలాంటి ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్‌‌లో పంచుకోగా.. ఇప్పుడు అదే ఫోటో పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

ఈ ఫోటోలో అలనాటి నటులు ఎన్టీఆర్‌, శివాజీ గణేశన్‌, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు‌, జెమిని గణేశన్‌, జయ లలిత, విజయ లలిత, అంజి, కాంచన, బిఎన్‌‌రెడ్డి, నంబియార్‌, పేకేటి శివరామ్, రాజనాల‌.. వీరందరూ ఒకే చోట కలిసి కనిపించడం విశేషం. ఇప్పుడు ఆ ఫోటోకి సోషల్ మీడియాలో కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి.

అయితే ఈ ఫోటోని ఏ సందర్భంగా తీశారో ఎలాంటి సమాచారమూ లేదు. బహుశా ఏదైనా విరాళాల సేకరణ కార్యక్రమం లేదా ప్రత్యేకమైన ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే వీరందరూ ఒకచోట కలిసి ఉండవచ్చని తెలుస్తోంది. ఇదే ఫోటోలో జెమిన్ గణేషన్ చేతిలో ఓ జెండాని కూడా చూడవచ్చు. 

Trending News