భీష్ముడి జోడీపై  క్లారిటీ వచ్చేసింది

నితిన్ హీరోగా నటిస్తున్న ‘భీష్మ’ మే నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుంది  

Last Updated : Apr 18, 2019, 12:20 PM IST
భీష్ముడి జోడీపై  క్లారిటీ వచ్చేసింది

వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్  హీరోగా తెరకెక్కుతున్న ‘భీష్మ’ మే నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి ని తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఈ ప్రచారానికి చెక్ పెడతూ ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. సినిమాలో ఒకే ఒక ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ఉందని... ఆ క్యారెక్టర్ రష్మిక చేస్తుందని ప్రకటించాడు. సో నితిన్ సినిమాలో రష్మిక మాత్రమే హీరోయిన్ అన్నమాట.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఎంతో కాలం నుంచి హిట్ పై కన్నేసిన నితిన్..ఈ మూవీపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరియు ప్రేక్షకలుు ఏ మేరకు ఆదరిస్తున్నారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.

Trending News