Gold Smuggling: చెన్నై ఎయిర్ పోర్ట్‌లో ఆగని గోల్డ్ స్మగ్లింగ్, చెప్పుల్లో బంగారం

Gold Smuggling: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా సరే..గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. రాను రానూ కొత్త కొత్త ఐడియాలతో అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు.  

Last Updated : Dec 14, 2020, 11:37 PM IST
  • చెన్నై ఎయిర్ పోర్ట్ లో మూడు వేర్వేరు ఘటనల్లో భారీగా బంగారం పట్టివేత
  • చెప్పుల్లో కూడా బంగారం అమర్చి స్మగ్లింగ్
  • వినూత్న పద్ధతుల్ని అవలంభిస్తున్న స్మగ్లర్లు
Gold Smuggling: చెన్నై ఎయిర్ పోర్ట్‌లో ఆగని గోల్డ్ స్మగ్లింగ్, చెప్పుల్లో బంగారం

Gold Smuggling: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా సరే..గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. రాను రానూ కొత్త కొత్త ఐడియాలతో అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. 

కస్టమ్స్ అధికార్లకు ( Customs Officers ) గోల్డ్ స్మగ్లింగ్ ( Gold Smuggling ) అతి పెద్ద తలనొప్పిగా మారింది. ఎయిర్‌పోర్ట్ వద్ద ఎంత అధునాతనమైన పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా సరే..స్మగ్లర్లు మాత్రం అంతకంటే ఎక్కువ తెలివితేటలతో కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని విదేశాల నుంచి తరలిస్తూనే ఉన్నారు. ఎయిర్‌పోర్ట్ ( Airport ) కాని ప్రాంతాల్లో అయితే విచ్చలవిడిగా సాగుతోంది.  చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవలే ఓ వ్యక్తి తన చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికార్లకు పట్టబడ్డాడు. ఇప్పుడు తాజాగా భారీగా బంగారం, నగదు నిల్వలు బయటపడ్డాయి. 

చెన్నై ఎయిర్‌పోర్ట్ ( Chennai Airport ) ‌లో మూడు వేర్వేరు ఘటనల్లో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. మొత్తం మూడు ఘటనల్లో 2.42 కిలోల బంగారం, 1.35 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనమైంది. దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చి ఫ్లైట్ నెంబర్ IX-1644లో ఏడుగురు ప్రయాణికుల్నించి పెద్ద మొత్తంలో బంగారం, నగదు స్వాధీనమైంది. కస్టమ్స్ అధికారులు కేవలం అనుమానంతో సోదా చేసినప్పుడు ఇదంతా బయటపడింది.

Also read: Rape: పార్టీకి పిలిచి..స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన మిలట్రీ కల్నల్ 

ఏడుగురు వ్యక్తుల్ని తనిఖీ చేసినప్పుడు 56 లక్షల విలువ కలిగిన 1.10 కిలోల బరువున్న 12 గోల్డ్ చైన్స్, 5 గోల్డ్ కాయిన్స్, 2 గోల్డ్ ప్లేట్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గోల్డ్ చైన్స్‌ను హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ కవర్స్‌లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు.  

దుబాయ్ ( Dubai )ఫ్లైట్ FZ 8517 నుంచి దిగిన 8 మంది ప్రయాణీకుల్నించి 17 గోల్డ్ కట్ బిస్కట్స్, 10 గోల్డ్ ఛైన్స్, 67 లక్షల విలువైన 1.32 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్  IX 1643 లో విదేశీ కరెన్సీ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని తనిఖీ చేయగా..12 లక్షల విలువైన సౌదీ కరెన్సీ పట్టుబడింది. Also read: RTGS Services: ఇకపై 24 గంటలు ఆర్టీజీఎస్ సదుపాయం

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x