Maharashtra: కుప్పకూలిన ఐదంస్తుల భవనం..శిధిలాల కింద 50 మంది ?

మహారాష్ట్రలో ( Maharashtra ) ఘోరం జరిగిపోయింది.  5 అంతస్తుల భవనం ( 5 storey building ) కుప్పకూలింది. శిధిలాల కింద 70 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

Last Updated : Aug 24, 2020, 08:51 PM IST
Maharashtra: కుప్పకూలిన ఐదంస్తుల భవనం..శిధిలాల కింద 50 మంది ?

మహారాష్ట్రలో ( Maharashtra ) ఘోరం జరిగిపోయింది.  5 అంతస్తుల భవనం ( 5 storey building ) కుప్పకూలింది. శిధిలాల కింద 70 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

సాయంత్రం 7 గంటల కావస్తోంది. ఆ ఇరుకైన ఇళ్లో ఎవరికి వారు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొందరు అప్పుడే పని ముగించుకుని ఇంటికి వచ్చారు. మరి కొందరు ఇంకా రావల్సి ఉంది. ఇంతలో ఆ భవనంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ఐదు అంతస్థుల భవనం ( Building collapsed ) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రాయ్ గడ్ ( Raigad District ) జిల్లా మహద్ తాలూకా ( mahad tehsil ) లోని కాజల్ పురా ( kajalpura ) లో జీ ప్లస్ 4 ( G plus 4 ) శైలిలో నిర్మించిన భవనమిది. పూణే నుంచి ఎన్డీఆర్ఎఫ్ ( ndrf teams ) బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయి. గాయాలపాలైన 17 మందిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంకా 50 మంది ( over 50 trapped ) వరకూ శిధిలాల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియలేదు. ఈ భవనం పదేళ్ల క్రితం నిర్మించిందని తెలుస్తోంది.

 

Trending News