దుబాయిలో తలపడనున్న భారత్, పాక్ జట్లు

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్తనందించింది. భారత్ పాక్ ల మధ్య ఆసక్తికర పోరు దుబాయ్ లో జరగనుందని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఆసియా ఖండం స్థాయిలో అగ్రశ్రేణి 

Last Updated : Feb 29, 2020, 10:51 AM IST
దుబాయిలో తలపడనున్న భారత్, పాక్ జట్లు

ముంబై: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్తనందించింది. భారత్ పాక్ ల మధ్య ఆసక్తికర పోరు దుబాయ్ లో జరగనుందని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఆసియా ఖండం స్థాయిలో అగ్రశ్రేణి జట్ల సంకుల సమరంగా పేరుగాంచిన ఆసియా కప్ వేదిక మారింది. ఈ టోర్నీ పాకిస్థాన్ లో సెప్టెంబరులో జరగాల్సి ఉండగా, భద్రతా కారణాలతో తాము హాజరు కాలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. దాంతో ఈ వేదికను పాక్ నుంచి దుబాయ్ కి తరలించారని, ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ధారించారు.

ఆసియా కప్ దుబాయ్ లో జరుగుతుందని, భారత్, పాక్ జట్లు ఈ టోర్నీలో ఆడతాయని వెల్లడించారు. మార్చి 3న దుబాయ్ లో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశానికి గంగూలీ కూడా హాజరవుతారని బీసీసీఐ తెలిపింది. దుబాయ్ వెళ్లే ముందు గంగూలీ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదం నేపథ్యంలో భారత జట్టు భద్రత, రాజకీయ పరమైన కారణాలతో గత కొంతకాలంగా పాకిస్థాన్ లో పర్యటించడంలేదని, ఐసీసీ టోర్నమెంట్లలో ఆడడమే తప్ప ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడంలేదని ఆయన అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News