అవంతిపుర ఆత్మాహుతి దాడి : 44కు చేరిన అమరవీరుల సంఖ్య!

44కు చేరిన అమరవీరుల సంఖ్య

Last Updated : Feb 15, 2019, 11:26 AM IST
అవంతిపుర ఆత్మాహుతి దాడి : 44కు చేరిన అమరవీరుల సంఖ్య!

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని అవంతిపురలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల సంఖ్య 44కు చేరింది. భద్రతా బలగాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉగ్రవాదుల దాడి జరిపిన నేపథ్యంలో భద్రత అంశాలపై సమీక్ష జరిపేందుకు నేడు ఉదయం 9:15 గంటలకు కేబినెట్ కమిటీ భేటీ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కేబినెట్ భేటీకి అధ్యక్షత వహించనుండగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ భేటీలో పాల్గొననున్నారు.

Trending News