తెలుగు ప్రజలకు చేసిన బాసలను బీజేపీ మరిచింది: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

బీజేపీ కన్నడ ప్రజల స్వాభిమానమే కాదు.. తెలుగు ప్రజల స్వాభిమానం కూడా అర్థం చేసుకోలేకపోతుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Apr 28, 2018, 05:52 PM IST
తెలుగు ప్రజలకు చేసిన బాసలను బీజేపీ మరిచింది: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

బీజేపీ కన్నడ ప్రజల స్వాభిమానమే కాదు.. తెలుగు ప్రజల స్వాభిమానం కూడా అర్థం చేసుకోలేకపోతుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బీజేపీ జనాల ఆకాంక్షలను అర్థం చేసుకుంటే తెలుగు ప్రజలకు ఇచ్చిన మాటకు నిజంగా కట్టుబడి ఉండేదని అన్నారు. కర్ణాటకకు మాత్రం బీజేపీ ఒక్కటే వాగ్దానం చేసిందని సిద్ధరామయ్య అన్నారు. బీజేపీ అభిమతం కేవలం రెడ్డి-ఎడ్డూరప్ప గ్యాంగులకు పదవి కట్టబెట్టి యూపీ తరహా పరిపాలన తీసుకురావాలని ఆశపడుతుందన్నారు. ఇవే మాటలు చెబుతూ సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్‌ను పోస్టు చేశారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలోని ప్రతి తెలుగువ్యక్తి కూడా బీజేపీకి ఓటు వేయకూడదని.. ఆ పార్టీని ఓడించడానికే కంకణం కట్టుకోవాలని చెప్పి పోస్టును రీట్వీట్ చేశారు

Trending News