కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ - సోము వీర్రాజు

                                               

Last Updated : May 22, 2018, 06:23 PM IST
కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ - సోము వీర్రాజు

ఇటీవలికాలంలో జగన్-పవన్ లను బీజేపీ నడిపిస్తోందని టీడీపీ నేతలు పదే పది ఆరోపణలు సంధిస్తున్న  విషయం తెలిసిందే.ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు.  వైసీపీ చీఫ్ జగన్ ను జైలుకు పంపాలనే ఏకైక అజెండాతోనే చంద్రబాబు తరచుగా ఢిల్లీ వెళ్లేవారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీడీపీ, చంద్రబాబు పై సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్-పవన్ లను బీజేపీ నడిపిస్తుంటే.. మరి..చంద్రబాబు ఎవరిని నడిపిస్తున్నారు ? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న టీడీపీ తనకు బద్ధశత్రువైన పార్టీతో చేతులు కలిపిందేకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు పలుతున్నారని విమర్శించారు. కర్ణాటక రాజకీయాలతోనే ఆయన కాలం గడుపుతున్నారని.. సాధికార సభల్లోనూ రాజకీయాలే ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు దీక్షల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సోమువీర్రాజు ఆరోపించారు.

Trending News