మూడో విడత పోలింగ్ లో హింస; బెంగాల్‌లో బాంబు దాడి

పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ సందర్భంగా అల్లర్లు కొనసాగుతున్నాయి

Last Updated : Apr 23, 2019, 12:14 PM IST
మూడో విడత పోలింగ్ లో హింస; బెంగాల్‌లో బాంబు దాడి

మూడో విడత పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముర్షిదాబాద్‌ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ దోమకల్‌ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద బాంబు దాడులు జరిగాయి . ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారు. స్థానిక ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స నందిస్తున్నారు. 

గాయపడ్డ వారు  తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ చెందిన  తూజమ్ అన్సారీ (50), మసాదుల్ ఇస్లామ్ (35), మాలిక్ మండల్ (27)గా గుర్తించారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 తాజా ఘటనతో పోలింగ్ బూత్ వద్ద మరింత భద్రతా బలగాలను మొహరించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్న సందర్భంగా జరిగిన ఘర్షణలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. 

 

 

Trending News