కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా రిలీజ్ !!

చివరి విడతలో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ సైన్యం సిద్ధమైంది

Last Updated : Apr 30, 2019, 12:18 PM IST
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా రిలీజ్ !!

పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ముంచుకొస్తుున్న నేపథ్యంలో  ఆయా రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ తమ స్లార్ క్యాంపెయినర్ల జాబితాను రిలీజ్ చేసింది.తాజా జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు 40 మందికి చోటు దక్కింది. 

స్లార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కించున్న వారిలో సీనియర్ నేతలు అహ్మద్ పటేల్ , గులాంనబీ ఆజాద్ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, షీలా దీక్షిత్, మనీశ్ తివారీ,  రాజ్ బబ్బర్, జైవీర్ షెర్గిల్ తదితరులు ఉన్నారు. పక్క రాష్ట్రానికి  ( రాజస్థాన్ ) చెందిన సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. 

చివరి దశలో మే 19న ఈ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ప్రచారకుల టీంను ఎంపిక చేసింది

Trending News