Corona Cases Updates: ఇండియాలో కరోనా తగ్గుముఖం, 50 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు

India Corona Cases Live Updates:  కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూల ప్రభావంతో కరోనా కేసులు తగ్గాయి, కానీ కోవిడ్19 మరణాలు నిలకడగా నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు 50 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : May 31, 2021, 11:02 AM IST
  • దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 16,83,135 శాంపిల్స్ పరీక్షించారు
  • ఇండియాలో కొత్తగా 1,52,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
  • కోవిడ్19తో పోరాడుతూ దేశ వ్యాప్తంగా మరో 3,128 మంది చనిపోయారు
Corona Cases Updates: ఇండియాలో కరోనా తగ్గుముఖం, 50 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు

India Corona Cases Live Updates: ఇండియాలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా పాజిటివ్ కేసులు 50 రోజుల కనిష్టానికి చేరుకున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూల ప్రభావంతో కరోనా కేసులు తగ్గాయి, కానీ కోవిడ్19 మరణాలు నిలకడగా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, క్రీమ్ ఫంగస్ కేసులపై రీసెర్చ్ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 16,83,135 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 1,52,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల వ్యవధిలో ఓరోజు వ్యవధిలో నమోదైన అతి తక్కువ కోవిడ్19 కేసులు ఇవే. మరోవైపు శనివారంతో పోల్చితే ఆదివారం నాడు దాదాపు 4 లక్షల శాంపిల్స్ తక్కువగా పరీక్షించడంతో పాజిటివ్ కేసులు తగ్గాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,80,47,534 (2 కోట్ల 80 లక్షల 47 వేల 534)కు చేరుకుంది. కోవిడ్19 (COVID-19 Infections)తో పోరాడుతూ మరో 3,128 మంది చనిపోగా, దేశంలో కరోనా మరణించిన వారి సంఖ్య 3,29,100కి చేరుకుంది.

Also Read: Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ ఇవే, మెట్రో వేళల్లో మార్పు

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన గత ఏడాది నుంచి నేటి వరకూ 34,48,66,883 (34 కోట్ల 48 లక్షల 66 వేల 883) శాంపిల్స్‌కు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,38,309 (2 లక్షల 38 వేల 22) మంది కరోనాను జయించి డిశ్ఛార్జ్ అయ్యారు. ఇండియాలో ఇప్పటివరకూ కరోనా వైరస్‌ (Corona Third Wave)ను జయించిన వారి సంఖ్య 2,56,92,342 (2 కోట్ల 56 లక్షల 92 వేల 342)కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. 

Also Read: Gold Price Today In Hyderabad 31 May 2021: మిశ్రమంగా బంగారం ధరలు, రూ.5,000 మేర పుంజుకున్న వెండి ధర

భారత్‌లో ఇప్పటివరకూ 21,31,54,129 డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది. దేశంలో ప్రస్తుతం 20 లక్షల 26 వేల 92 యాక్టివ్ కేసులున్నాయి. చాలావరకు బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ, మిగతా పేషెంట్లు ఇంటివద్ద హోం ఐసోలేషన్‌లో డాక్టర్ల సలహాలు పాటిస్తూ మెడిసిన్ తీసుకుంటున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News