Delta Plus Variant: డెల్టా ప్లస్ వేరియంట్ భయం, మహారాష్ట్రలో మరోసారి కఠిన ఆంక్షలు

Delta Plus Variant: కరోనా సెకెండ్ వేవ్ సద్దు మణుగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. రేపట్నించి మరోసారి కఠిన ఆంక్షల్ని అమలు చేయనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2021, 02:03 PM IST
Delta Plus Variant: డెల్టా ప్లస్ వేరియంట్ భయం, మహారాష్ట్రలో మరోసారి కఠిన ఆంక్షలు

Delta Plus Variant: కరోనా సెకెండ్ వేవ్ సద్దు మణుగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. రేపట్నించి మరోసారి కఠిన ఆంక్షల్ని అమలు చేయనుంది.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ధాటికి ఎక్కువగా ప్రభావితమైంది మహారాష్ట్రనే. ఇప్పుడు దేశవ్యాప్తంగా భయపెడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్(Delta Plus Variant) కేసులు కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులున్నట్టు తేలింది. డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం కావడం, సంక్రమణ వేగం ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపట్నించి మరోసారి కఠినమైన ఆంక్షల్ని అమలు చేయనుంది. వాస్తవానికి కరోనా కేసులు తగ్గడంతో మహారాష్ట్రలో ప్రస్తుతం అన్‌లాక్ (Unlock)ప్రక్రియ నడుస్తోంది. ఇప్పుడీ డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మళ్లీ ఆంక్షలు తప్పడం లేదు. 

రాష్ట్రంలో షాపులు సాయంత్రం 4 గంటల వరకే తెరిచేందుకు అనుమతించనున్నారు. నిత్యవసరాలు, అత్యవసర సేవల వస్తువులు విక్రయించే షాపులకు శని, ఆదివారాలతోపాటు ప్రతి రోజు 4 గంటల వరకు తెరిచేందుకు అనుమతించారు. అయితే ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం నిత్యవసరాలు కాని, షాపులను మాత్రం శని, ఆదివారాలలో మూసివేయాల్సి ఉంటుంది. మరోవైపు అక్కడి పరిస్థితులను బట్టి స్థానిక అధికారులు ఆంక్షలను మరింత కఠినం కూడా చేసేందుకు వీలుంటుంది. రెస్టారెంట్లు, హోటళ్లను కూడా సాయంత్రం 4 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించారు. మాల్స్, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మాత్రం మూసివేసి ఉంటాయి. ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లా ప్రస్తుతం మొదటి దశలో ఉండటంతో గతంలో ఆంక్షలు ఎత్తివేశారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra government) జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం తిరిగి ఆంక్షల్ని విధించారు. కేసుల తగ్గిపోయి..ఆంక్షల్ని సడలించిన ప్రాంతాల్లో తిరిగి కఠినమైన ఆంక్షల్ని అమలు చేయనున్నారు. 

Also read: UP Elections: ఎంఐఎంతో పొత్తు విషయంలో మాయావతి ఆగ్రహం..కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News