పంజాబ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

     

Last Updated : Oct 15, 2017, 01:05 PM IST
పంజాబ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కర్ 1,93,219 ఓట్ల తేడాతో సమీప బీజేపీ అభ్యర్థి స్వరణ్ సలారియాపై గెలుపొందారు. ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆయనకు ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇదే విషయమై పంజాబ్ క్యాబినెట్ మంత్రి నవజ్యోత్ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ, ఈ గెలుపు దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కానుక అని అభివర్ణించారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోటీ నెలకొన్న ఈ ఎన్నికలలో, ఆఖరికి సునీల్ జక్కర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీకి చెందిన  ఎమ్మెల్యే మరియు సినీ నటుడు వినోద్ ఖన్నా మరణించాక, అతని స్థానాన్ని భర్తీ చేయడం కోసం గురుదాస్‌పూర్‌లో ఉపఎన్నికలు జరిగాయి. 

Trending News