కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం

ఘటనపై విచారణకు ఆదేశించిన భారత వైమానిక దళం

Last Updated : Jul 18, 2018, 04:01 PM IST
కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం

భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి విమానం ఎంఐజీ-21 హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో ప్రమాదవశాత్తుగా కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందినట్టు భారత వైమానిక దళం స్పష్టంచేసింది. పంజాబ్‌లోని పటాన్‌కోట్ వైమానిక స్థావరం నుంచి రోజువారీ విధుల్లో భాగంగానే గాల్లోకి లేచిన ఈ యుద్ధ విమానం ఆ తర్వాత కొద్దిసేపట్లోనే మధ్యాహ్నం 1:21 గంటలకు కంగ్రా జిల్లాలోని పట్టా జటియాన్‌కి సమీపంలోని మెహ్ర పల్లి గ్రామంలోని పొలాల్లో కూలిపోయింది.

 

ఘటనపై శాఖాపరమైన అంతర్గత విచారణకు ఆదేశించినట్టు భారత వైమానిక దళం స్పష్టంచేసింది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x