ఆగమేఘాలపై అమెరికా నుంచి బెంగళూరుకు

హుటాహుటిన అమెరికా నుంచి బెంగళూరు వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి

Last Updated : Jul 8, 2019, 12:00 AM IST
ఆగమేఘాలపై అమెరికా నుంచి బెంగళూరుకు

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనను మధ్యలోనే ముగించుకుని హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయంలోనే తనకు స్వాగతం పలికిన నేతలతో చర్చించి తాజా పరిస్థితిపై ఆరా తీసిన కుమారస్వామి.. అక్కడి నుంచి నేరుగా తాజ్ వెస్ట్ ఎండ్ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారు. ఈ హోటల్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 

ఇదిలావుంటే, ఎలాగైనా సరే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించాలనే యత్నాల్లో వున్న జేడీఎస్, కాంగ్రెస్ నేతల వ్యూహాలు ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. రాజీనామాలు ఉపసంహరించుకునే ఆలోచనే లేదని కొందరు అసమ్మతి నేతలు తెగేసి చెబుతుండటమే అందుకు కారణం. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x