నన్ను చంపేందుకు ఓ పొలిటికల్ పార్టీ సుపారీ ఇచ్చింది : జీ న్యూస్‌తో మమతా బెనర్జీ

తనని చంపేందుకు రెక్కీ నిర్వహించారన్న మమతా బెనర్జీ 

Last Updated : May 13, 2018, 01:16 PM IST
నన్ను చంపేందుకు ఓ పొలిటికల్ పార్టీ సుపారీ ఇచ్చింది : జీ న్యూస్‌తో మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో ఫైర్ బాంబ్‌గా పేరున్న మమతా బెనర్జీ తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు తనని అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నాయని దీదీ ఆరోపించారు. ప్రత్యేకించి ఓ పార్టీ తనని హత్య చేసేందుకు ఇప్పటికే సుపారీ కూడా ఇచ్చింది అని మమతా బెనర్జీ స్పష్టంచేశారు. తనని చంపేందుకు ఎవరైతే కుట్ర పన్నుతున్నారో.. వాళ్లు ఇప్పటికే తన ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు అని అన్నారామె. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా తనని ఇల్లు మారాల్సిందిగా పోలీసులు సూచించినట్టు దీదీ చెప్పారు. కోల్‌కతాలో ప్రముఖ జీ మీడియా గ్రూప్‌కి చెందిన బెంగాలీ న్యూస్ ఛానెల్ జీ 24 గంటలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. తనని చంపేందుకు కుట్ర జరగడం ఇదేం మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి కుట్రలు జరిగాయని మమతా బెనర్జీ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  

ఇంటెలీజెన్స్ బ్యూరో వర్గాలు అందించిన ఈ విశ్వసనీయమైన సమాచారం నిజమేనన్న మమతా బెనర్జీ.. తనని ఇంటెలీజెన్స్ అధికార వర్గాలు ప్రభుత్వ బంగ్లాకు మారాల్సిందిగా సూచించారని గుర్తుచేశారు. అయితే, తాను చావుకు భయపడే రకం కాదు అని ఈ సందర్భంగా దీదీ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె తన సొంత నివాసంలో వుంటున్నారు. ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఆమె అక్కడే వుంటున్నారు. 

Trending News