నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారి ఆట కట్టించే బిల్లు వచ్చేసింది.. కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయే నేరస్థుల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్న ఆర్థిక నేరస్తుల బిల్లుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.

Last Updated : Aug 6, 2018, 04:28 PM IST
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారి ఆట కట్టించే బిల్లు వచ్చేసింది.. కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయే నేరస్థుల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్న ఆర్థిక నేరస్తుల బిల్లుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి చేత ఆమోదం పొందింది కాబట్టి.. ఇప్పుడు ఈ బిల్లు చట్టంగా కూడా మారింది. ఒకవేళ నేరస్తుడు చేసిన ఆర్థిక నేరం వంద కోట్లకు మించితే.. వారి ఆస్తులను ఆ కేసును దర్యాప్తు చేసే సంస్థలు స్వాధీనం చేసుకోవచ్చని ఈ కొత్త చట్టం చెబుతోంది. ప్రస్తుతం నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు ఇలాంటి నేరాలు చేసే విదేశాలకు పారిపోయిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కొత్త చట్టం అమలులోకి వస్తుంది కాబట్టి.. ఇప్పుడు అలాంటి నేరాలు చేసినవారి ఆస్తులతో పాటు వారికి బినామీలుగా వ్యవహరిస్తున్న వారి ఆస్తులను కూడా ప్రభుత్వం జప్తు చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక నేరస్తుల ఆటకట్టించే బిల్లుకు జులై 19వ తేదిన తొలిసారిగా లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అదే నెల 25వ తేదిన రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇదే బిల్లుకు భారత రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో అదే బిల్లు చట్టంగా కూడా మారింది. 

ఈ బిల్లులో భాగంగా మనీ లాండరింగ్‌ను నియంత్రించే చట్టం, 2002కి స్పెషల్ కోర్టు ఆదేశాల్లో భాగంగా పలు సవరణలు చేశారు. ఈ కొత్త బిల్లులో భాగంగా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోతే.. వారి ఆస్తులను దర్యాప్తు సంస్థల సహాయంతో బ్యాంకు అధికారులు వేలం వేసి సొమ్మును రికవర్ కూడా చేసుకోవచ్చు. 

Trending News