Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు

యుద్ధ రంగంలో అర్జునుడు ఏది ధర్మం ఏది అధర్మం ( Arjun In Kurukshetra ) అని తెలుసుకోవడంలో దిగులు పడుతున్న సమయంలో కృష్ణుడు అర్జునుడికి క్షత్రీయ ధర్మం ( What Is Kshatriya Dharma by Lord Krishna To Arjun ) అంటే ఏంటో వివరిస్తాడు. మహాభారత యుద్ధంలో అర్జునికి మార్గదర్శనం చేస్తాడు శ్రీకృష్ణుడు. 

Last Updated : Aug 10, 2020, 12:34 PM IST
    1. యుద్ధంలో సెంటిమెంట్ కాదు.. చర్య ముఖ్యం.
    2. ఏదీ శాశ్వతం కాదు..
    3. ప్రశాంతతే ముఖ్యం...
Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు

యుద్ధ రంగంలో అర్జునుడు ఏది ధర్మం ఏది అధర్మం ( Arjun In Kurukshetra ) అని తెలుసుకోవడంలో దిగులు పడుతున్న సమయంలో కృష్ణుడు అర్జునుడికి క్షత్రీయ ధర్మం ( What Is Kshatriya Dharma by Lord Krishna To Arjun ) అంటే ఏంటో వివరిస్తాడు. మహాభారత యుద్ధంలో అర్జునికి మార్గదర్శనం చేస్తాడు శ్రీకృష్ణుడు. భగవద్గీత అనేది కృష్ణుడు అర్జునుడి మధ్య సాగిన సంభాషణ ( Conversation Between Krishna And Arjun ). పాండవ యువరాజు (Pandava Prince ) యుద్ధ రంగంలో.. తమ సొంతవారిపై దాడి చేయాలా వద్దా అని సంకోచిస్తున్న తరుణంలో శ్రీ కృష్ణుడు మార్గదర్శనం చేస్తాడు ( Srikrishna in Mahabharata ). శ్రీ కృష్ణుడు అర్జునుడి రథానికి సారధి కూడా. మాధవుడు ఆ నాడు కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పిన జీవిత సత్యాలు ( Life Lessons of Srikrishna In Bhagavad Gita To Arjun ) నాటికీ, నేటికీ ఎప్పటికీ మానవజాతికి మార్గదర్శకాలు. Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?  రాముడి పాలన ఎలా సాగింది?

శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు ( Thus Spokes of Lord Krishna )

క్షత్రీయుడిగా నీ ధర్మం యుద్ధ రంగంలో ముందుండటం. చర్యతో ధర్మాన్ని  పాటించవచ్చు. నీ శరీరం తాత్కాలికం. నీ ఆత్మ అమరం ( Soul Is Forever). అందుకే నీవు మోహాన్ని, శారీరక వాంఛలు విడనాడాలి.

నువ్వు ఏం చేసినా ఆ చర్యలు  శ్రీకృష్ణుడి ప్రకారమే. నేను నీలో ఎప్పుడూ ఉంటాను.

నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు. భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి.

గుర్తుంచుకో...ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము. ఇప్పుడ ఏ జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది. Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు

మరణం అనివార్యం ( Death Inevitable ). పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరూ అమరులు కాదు. 

మానసిక శాంతి చాలా ముఖ్యం ( Peace Of Mind in Bhagavad Gita ). కోపం అనేది భ్రమలాంటిది. అది బుద్ధిని ఇబ్బంది పెడుతుంది ( Lord Krishna About Anger ). 

అతిగా స్పందించడం..అది కోపం.. అతి ప్రేమ.. అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు.

స్వార్థం నీ వివేకాన్ని చంపేస్తుంది ( Lord krishna About Selfishness) . స్వార్థపరుడు తన లాభాల కోసమే చూస్తాడు.. ఇతరులే సంక్షేమం గురించి ఆలోచిస్తాడు. 

అన్ని పనులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కర్మ అనుభవించాల్సి ఉంటుంది ( Lord Sri Krishna About Karma ). అందుకే మంచి కర్మలు చేయాలి.

కర్తవ్యం నిర్వర్తించడంలో సిగ్గుపడకూడదు. మనిషి తన కర్మల వల్ల గుర్తింపు సాధిస్తాడు. సరైన పనిచేసిన వ్యక్తిని ప్రపంచం కీర్తిస్తుంది. నీ కర్తవ్యం నుంచి పారిపోవడం మంచిది కాదు.Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది

Trending News