Naga Chaitanya: ఆ టాపిక్ గురించి మాట్లాడి టైం వేస్ట్!.. నాగ చైతన్య అలా అన్నాడేంటి?

Naga Chaitanya Says Time Waste about Parasu Ram: కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య డైరెక్టర్ పరుశురాం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : May 6, 2023, 03:37 PM IST
Naga Chaitanya: ఆ టాపిక్ గురించి మాట్లాడి టైం వేస్ట్!.. నాగ చైతన్య అలా అన్నాడేంటి?

Naga Chaitanya Serious Comments on Parasu Ram: నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మే 12వ తేదీన ఈ సినిమా తెలుగు సహా తమిళ హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీ శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు.

ఈ సినిమాలో నాగచైతన్య ఒక కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండగా ఒక ఆసక్తికరమైన కథాంశంతో సినిమా రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. ఎక్కడైనా ఏ సినిమాలో అయినా హీరో విలన్నీ అంతమొందించడానికి లేదా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలో హీరో పాత్ర విలన్ పాత్రను కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందట. అదే ఈ సినిమా మొత్తానికి కీలకమైన కథాంశంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఇంకా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

నాగచైతన్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య డైరెక్టర్ పరుశురాం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి పరశురాం నాగచైతన్య కాంబినేషన్లో ఒక సినిమా రావచ్చని ప్రచారం ముందు నుంచి జరిగింది. సర్కారు వారి పాట ముందు నుంచే ఈ ప్రచారం జరిగింది. కానీ సర్కారు వారి పాట సినిమా కోసం ఈ సినిమా వాయిదా పడిందని ఆ తర్వాత తెరకెక్కుతుందని ప్రచారం తెర మీదకు వచ్చింది.

Also Read: Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం

అయితే ఇప్పుడు పరశురాం గీత గోవిందం హీరో విజయ్ దేవరకొండ దిల్ రాజు కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించారు. కానీ నాగ చైతన్యతో పరశురామ్ ఉంటుందా? లేదా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక ఇదే విషయాన్ని నాగచైతన్య ముందు ప్రస్తావిస్తే అసలు డైరెక్టర్ పరుశురాం గురించి మాట్లాడడం టైం వేస్ట్ వ్యవహారం అని తేల్చేశాడు నాగ చైతన్య. పరశురాం తన టైం వేస్ట్ చేశాడని అసలు ఆ వ్యవహారం గురించి మాట్లాడడం కూడా తనకు ఇష్టం లేదని ఈ సందర్భంగా నాగచైతనే తేల్చి చెప్పాడు.

నిజానికి పరుశురాం ఇలా వ్యతిరేకత ఎదుర్కోవడం మొదటిసారి కాదు ఆయన దాదాపుగా 5 టాప్ ప్రొడక్షన్ హౌస్ల నుంచి చాలా సంవత్సరాల క్రితమే అడ్వాన్సులు తీసుకున్నాడు కానీ ఒక్క సినిమాను కూడా పూర్తి చేయలేదని అంటున్నారు. దిల్ రాజుతో సినిమా ప్రకటించిన సమయంలో ఆగ్రహించిన అల్లు అరవింద్ ఇదే వ్యవహారం మీద ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. తర్వాత ప్రొడ్యూసర్స్ గిల్డ్ లోని కొందరు పెద్దలు ఈ విషయం మీద ఆయనను సమాధానపరిచి శాంతింప చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నాగచైతన్య కూడా పరశురామ్ గురించి ఈ మేరకు నెగిటివ్ కామెంట్స్ చేయడంతో పరశురామ్ పనితీరు గురించి ఆయన వ్యవహారం గురించి చర్చ జరుగుతోంది.

ఇక కస్టడీ సినిమా గురించి నాగచైతన్య మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి కొన్ని సినిమాలు ఎడిటింగ్ టేబుల్ మీద ఆడవు అని అర్థం అయిపోతాయని అలా నాకు తేడా కొట్టిన సినిమా థాంక్యూ అని చెప్పుకొచ్చారు. ఎలాగో తీశాం కదా నిర్మాత నష్టపో కూడదు అని కష్టంగానే ప్రమోట్ చేస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాను నటిస్తున్న దూత వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తే అప్పుడు సూపర్ గా ఉండబోతుందని ఆయన అన్నారు. అయితే కస్టడీ ఎడిట్ టేబుల్ మీద తనకు ఒక్క లోపం కూడా కనిపించలేదని ఈ సందర్భంగా నాగచైతన్య కామెంట్లు చేశారు.

Also Read: Samantha Reply to Nagachaitanya: మనని అవే దూరం చేశాయి.. నాగచైతన్యకి సమంత కౌంటర్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News