Indonesia: హనీమూన్​లో విషాదం... తమిళనాడుకు చెందిన వైద్య దంపతులు మృతి..!

Indonesia:  హనీమూన్ కోసం ఇండోనేషియాకు వెళ్లిన ఓ భారతీయ నవ జంట ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన పది రోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఫోటోషూట్ కోసం..బాలిలో వాటర్ బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2023, 10:20 AM IST
Indonesia: హనీమూన్​లో విషాదం... తమిళనాడుకు చెందిన వైద్య దంపతులు మృతి..!

Doctor couple dies in Indonesia: ఇండోనేషియాలోని బాలికి హనీమూన్‌కి వెళ్లిన ఓ భారతీయ నవ జంట సముద్రంలో మునిగి మృతి చెందారు. పెళ్లైన పది రోజులకే భార్యభర్తలు ప్రాణాలు కొల్పోవడం ఇరువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు రాష్ట్రానికి చెందిన లోకేశ్వరన్, విబుష్నియా వృత్తిరీత్యా డాక్టర్లు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్ద వాళ్లను ఒప్పించి జూన్ 01న స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నూతన వధూవరులిద్దరు కలిసి హనీమూన్ కోసం ఇండోనేషియాకు వెళ్లారు. 

బాలిలో వీరిద్దరు మోటార్ బోటుపై సముద్రంలో ఫోటోషూట్ నిర్వహిస్తుండగా.. ఇద్దరూ అనూహ్యంగా నీటిలో మునిగి చనిపోయారు. స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టి లోకేశ్వరన్ మృతదేహాన్ని వెలికితీశారు. విబుష్నియా మృతదేహం ఇంకా లభించకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అక్కడి అధికారులు. ఈ విషాద వార్తను విన్న ఇరువురి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యుడు లోకేశ్వరన్ సేలం జిల్లాకు చెందినవాడు కాగా... విబుష్నియా (25)  పూంతమల్లి వాసి. 

Also Read: Biperjoy Cyclone Alert: అతి భీకర తుపానుగా మారనున్న బిపర్‌జోయ్, తీరం దాటేది ఎక్కడంటే

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. డీఏ 4 శాతం పెరిగితే.. జీతం ఎంత వస్తుంది..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News