అప్పటివరకు తొందరపడొద్దు.. తెలంగాణ ఈసీకి హై కోర్టు ఆదేశాలు

తెలంగాణ ఈసీకి హై కోర్టు ఆదేశాలు

Last Updated : Oct 6, 2018, 12:19 PM IST
అప్పటివరకు తొందరపడొద్దు.. తెలంగాణ ఈసీకి హై కోర్టు ఆదేశాలు

తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. తమ వద్ద నుంచి తుది ఉత్తర్వులు అందే వరకు ఓటర్ల అంతిమ జాబితాను వెబ్‌సైట్లో బహిర్గతం చేయవద్దని తెలంగాణ ఈసీని ఆదేశించింది. అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్‌ను రిట్ పిటీషన్‌కు లోబడి ప్రకటించాలని ఈ సందర్భంగా హైకోర్టు ఈసీకి సూచించింది. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా హై కోర్టు ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. 

ఈ పిటిషన్ విచారణను 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. ఆలోగా కోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈసీకి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. 

Trending News