NTR's Biopic : 'కథా నాయకుడు' రిలీజ్; అభిమానులతో కలిసి ఫస్ట్ షో చూసిన బాలయ్య

బాలయ్య హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ 'కథా నాయకుడు' మూవీ ప్రేక్షకుల ముందు వచ్చేసింది.

Last Updated : Jan 9, 2019, 11:03 AM IST
NTR's Biopic : 'కథా నాయకుడు' రిలీజ్; అభిమానులతో కలిసి ఫస్ట్ షో చూసిన బాలయ్య

అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఎంతో ఆశగా ఎదురుచూసిన ఎన్టీఆర్ బయోపిక్ 'కథా నాయకుడు' ప్రేక్షకుల ముందు వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య హీరోగా నటించిన ఎన్టీఆర్ 'కథనాయకుడు' చిత్రం విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడిని తలపిస్తోంది. బాలయ్య అభిమానులు సందడితో ఏపీ,తెలంగాణలోని థియోటర్లు వద్ద జాతర వాతావరణం కలిపిస్తోంది. ధియోటర్ల వద్ద జై బాలయ్య..జై ఎన్టీఆర్ నినాదాలు మార్మోగాయి. ఎక్కడ చూసినా ఎన్టీఆర్,బాలయ్య ఫక్లీలు,కటౌట్లు కనిపిస్తున్నాయి. కాగా సినిమా చూసేందుకు బాలయ్య అభిమానులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ధియోటర్లకు తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా దెందలూరులో అమిమానులతో కలిసి బాలయ్య తొలి ఆటను తిలకించారు. బాలయ్యతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాను వీక్షించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నైలోనూ ఎన్టీఆర్ 'కథనాయకుడు' సందడి నెలకొంది. అక్కడ కూడా భారీ ఎత్తున ఎన్టీఆర్ బ్యానర్లు కటౌన్లు పెట్టి బాలయ్య పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు

Trending News