రాజస్తాన్‌లో కూలిపోయిన యుద్ధ విమానం

రాజస్తాన్‌లో కూలిపోయిన యుద్ధ విమానం

Last Updated : Mar 31, 2019, 02:52 PM IST
రాజస్తాన్‌లో కూలిపోయిన యుద్ధ విమానం

జోధ్‌పూర్: భారత వాయుసేనకు చెందిన మిగ్-27 యుద్ధ విమానం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌కు 120 కిమీ దూరంలో ఆదివారం ఉదయం కూలిపోయింది. ఎప్పటిలాగే రోజువారి విధులలో భాగంగా టేకాఫ్ అయిన విమానం ఆ తర్వాత కొద్దిసేపటికే జోధ్‌పూర్‌కి దక్షిణాన కుప్పకూలింది. అదృష్టవశాత్తుగా ప్రమాదం జరిగిన సమయంలో అప్రమత్తమైన పైలట్.. విమానంలోంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఘటనాస్థలిలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. 

యుద్ధ విమానం కూలిపోయిన ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించినట్టు వాయిసేన అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Trending News