నా 'మన్ కీ బాత్' చెప్పడానికే ఇక్కడికి రాలేదు : మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు

నా 'మన్ కీ బాత్' చెప్పడానికే ఇక్కడికి రాలేదు : మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు

Last Updated : Apr 17, 2019, 06:17 PM IST
నా 'మన్ కీ బాత్' చెప్పడానికే ఇక్కడికి రాలేదు : మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు

వయనాడ్: తాను తన మన్ కీ బాత్ చెప్పడానికే వయనాడ్‌కి రాలేదని, మీ మనసుల్లో ఏముందో తెలుసుకోవడానికే వచ్చానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఉదయం కేరళలోని తిరునెల్లి ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం.. వయనాడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. ''తాను అందరు రాజకీయ నాయకుల మాదిరిగా వయనాడ్‌కి రాలేదని.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో అబద్దాలు చెప్పడానికి అస్సలే రాలేదని చెబుతూ మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. తాను ప్రధాని మోదీలా అబద్దాలు చెప్పే వ్యక్తిని కాదన్న రాహుల్ గాంధీ.. వయనాడ్ వాసుల తెలివితేటలు, చైతన్యం, అవగాహనపై తనకు అమితమైన  గౌరవం ఉండటమే అందుకు కారణం అని తెలిపారు. 

తాను వయనాడ్ నుంచి ఏదో కొన్ని నెలల బంధం మాత్రమే కోరుకోవడం లేదని, జీవితాంతం మీతో అనుబంధం ఉండాలని కోరుకుంటున్నానని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

Trending News