నాల్గో వన్డే: పోరాడి ఓడిన టీమిండియా ..!

Last Updated : Sep 29, 2017, 10:52 AM IST
నాల్గో వన్డే: పోరాడి ఓడిన టీమిండియా ..!

వరుస విజయాలతో దూసుకుపోయిన కోహ్లీసేనకు బ్రేక్ పడింది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన lనాల్గో వన్డే క్రికెట్ లో పరాభావం ఎదురైంది.   లక్ష్యసాధనకు చేరువైనా 21 పరుగుల తేడాతో టీమిండియా చతికిలపడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో 334 పరుగులు చేసింది. ఆతర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో 313 పరుగులు  చేసింది. తుదివరకు పోరాడినా ఆఖర్లో చతికిలపడింది. జాదవ్, రోహిత్, రహానే అర్థసెంచరీలతో మెరిసిన ఫలితం లేకపోయింది. 

Trending News