JEE Main 2021 Registration: జేఈఈ మెయిన్ 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

JEE Main 2021 Registration: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main 2021) రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15 నుంచి అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే ఏడాది జేఈఈ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2021లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇటీవల తెలిపారు.

Last Updated : Dec 15, 2020, 05:44 PM IST
  • జేఈఈ 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
  • మెయిన్స్ దరఖాస్తులు నేడే షురూ
  • జనవరి 15, 2021 తుదిగడువు
JEE Main 2021 Registration: జేఈఈ మెయిన్ 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

JEE Main 2021 Registration: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main 2021) రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15 నుంచి అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే ఏడాది జేఈఈ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2021లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (Ramesh Pokhriyal Nishank) ఇటీవల తెలిపారు. గత గురువారం బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో ఆన్‌లైన్ సంభాషణ సందర్భంగా కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. 

జేఈఈ మెయిన్ 2021 రిజిస్ట్రేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మంగళవారం (డిసెంబర్ 15న) ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ 2021 దరఖాస్తుల తుది గడువు జనవరి 15, 2021తో ముగియనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, అర్హులు, దరఖాస్తుల తేదీల పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Also Read: JEE Mains 2021 To Be Held Four Times: వచ్చే ఏడాది నాలుగుసార్లు జేఈఈ మెయిన్స్   
 

JEE Main 2021 Registration Begins from December 15

సాధారణంగా జేఈఈ-మెయిన్స్ (JEE Mains) 2 పర్యాయాలు నిర్వహిస్తారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి నుంచి మే వరకు ప్రతి ఒకసారి JEE Mains 2021 పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు సౌలభ్యాన్ని అందించడానికి ఒకటి లేదా అన్ని పరీక్షలకు హాజరయ్యే ఆప్షన్ ఎంచుకోవచ్చునని మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (Ramesh Pokhriyal Nishank) పేర్కొన్నారు. మొత్తం పరీక్షలలో అత్యధిక స్కోర్, ర్యాంక్‌ను ప్రవేశాలకు అర్హతగా పరిగణించనున్నారు.

Also Read : Jobs 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News