ఏడేళ్ల తర్వాత మొట్టమొదటి విజయం అందుకున్న టీమిండియా

విరాట్ కోహ్లీ చెప్పినట్టుగా ఈ విజయం టీమిండియాకు కచ్చితంగా ప్రత్యేకమైనదే 

Last Updated : Jan 28, 2018, 12:50 AM IST
ఏడేళ్ల తర్వాత మొట్టమొదటి విజయం అందుకున్న టీమిండియా

జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా సిరీస్ లో ఓటమిపాలైతే అయ్యుండవచ్చు కానీ ఈ గెలుపుతో ఇండియన్స్‌కి మాత్రం మరో రకమైన విజయాన్నే అందించింది. 
అదే ఏడేళ్ల తర్వాత టీమిండియాకు వాండరర్స్ మైదానంపై తొలి టెస్ట్ మ్యాచ్ గెలవడం.

అవును, 2010లో అప్పటి టీమిండియా సారధి సౌరవ్ గంగూలీ నేతృత్వంలో వాండరర్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌‌లో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై ఆ దేశాన్ని ఓడించడం మళ్లీ ఇదే తొలిసారి. అందుకే విరాట్ కోహ్లీ చెప్పినట్టుగా ఈ విజయం టీమిండియాకు కచ్చితంగా ప్రత్యేకమైనదే అని అనుకోవచ్చు. 

Trending News