COVID-19: తెలంగాణలో ఒక్కరోజులో 500 పైగా కరోనా కేసులు, జాగ్రత్తలు పాటించకపోతే అంతే

Telangana CoronaVirus Cases | గత కొన్ని రోజులుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, తాజాగా 500కు పైగా కేసులు నిర్ధారించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,339కు చేరింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 28, 2021, 10:27 AM IST
  • తెలంగాణలో తాజాగా 535 మంది కరోనా బారిన పడ్డారు
  • మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,339కు చేరింది
  • ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది
COVID-19: తెలంగాణలో ఒక్కరోజులో 500 పైగా కరోనా కేసులు, జాగ్రత్తలు పాటించకపోతే అంతే

దేశంలో ఆరు రాష్ట్రాల నుంచే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, తాజాగా 500కు పైగా కేసులు నిర్ధారించారు. తెలంగాణలో తాజాగా 535 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,339కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో శనివారం రాత్రి 8 గంటల వరకు 57,942 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 535 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ జరిగింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 6 వేల 3 వందల ముప్పై తొమ్మిదికి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,688కి చేరింది.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 28, 2021, ఓ రాశివారికి ధనలాభం

గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరిగింది. శనివారం నాడు 278 మంది చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,00,156 మంది కరోనా మహమ్మారిని జయించడం గమనార్హం. 

జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 154 జీహెచ్ఎంసీలోనే నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా(CoronaVirus) సెకండ్ సేవ్ కారణంగా హాస్టళ్లు, మెస్‌లు సైతం మూసివేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,495 ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 1,979 మంది ఉన్నారు.

Also Read: Gold Price Today 28 March 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe


Trending News