హోలీ ఏడాదికి ఒక్కసారే.. జుమా నమాజ్ ఏడాదిలో 52సార్లు ఉంటుంది

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు.

Last Updated : Mar 5, 2018, 10:27 AM IST
హోలీ ఏడాదికి ఒక్కసారే.. జుమా నమాజ్ ఏడాదిలో 52సార్లు ఉంటుంది

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. హోలీ పండగ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, ఆ పండగను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెబుతూ, జుమా నమాజ్(శుక్రవారం మధ్యాహ్నం జరిగే ప్రత్యేక ప్రార్థన) సంవత్సరంలో 52 సార్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. మొదటిసారి హోలీకోసం జుమా నమాజ్ ను వాయిదా వేశారన్నారు. ఇందుకు ముస్లిం మతపెద్దలకు ధన్యవాదాలు తెలిపారు యోగి. హోలీ గురించి మాట్లాడుతూ, నమాజ్ ప్రస్తావన తేవడం ఎందుకని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ నెల 11న ఉప ఎన్నికలు జరగనున్న ఫుల్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కాగా, యూపీలో నమాజ్ జరిగే సమయంలో హోలీ ర్యాలీ సాగుతుండటం, ఆ సమయంలో ప్రార్థనలకు వెళ్లే ముస్లింలపై రంగులు చల్లడం, ఆపై జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో ఈ సంవత్సరం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు విజ్ఞప్తి మేరకు సున్నిత ప్రాంతాల్లో శుక్రవారం నమాజ్ సమయాన్ని అరగంట నుంచి దాదాపు గంట వరకూ వాయిదా వేశారు. అయితే, దాన్ని ప్రస్తావిస్తూ, యోగి చేసిన వ్యాఖ్యలు మాత్రం చిచ్చు రేపుతున్నాయి. ఆదిత్యనాథ్ ఇలా మాట్లాడటం మత ఉద్రిక్తతలకు దారితీస్తుదని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

Trending News