Esha Gupta: తెల్ల రంగు కోసం 9 వేల ఖరీదైన ఇంజెక్షన్లు వాడిన రామ్‌చరణ్ హీరోయిన్, ఒత్తిడి ఉండేదన్న ఈషా గుప్తా

Esha Gupta: బాలీవుడ్ హాట్ నటి, రామ్‌చరణ్ హీరోయిన్ తెల్లగా కన్పించేందుకు ఖరీదైన ఇంజెక్షన్లు తీసుకునేదా..కెరీర్ ప్రారంభంలో అలా చేయమని ఆమెపై ఒత్తిడి చేసిందెవరు. బాలీవుడ్‌లో ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2022, 08:53 PM IST
  • కెరీర్ ప్రారంభంలో ఎదురైన షాకింక్ నిజాలు వెల్లడించిన రామ్‌చరణ్ హీరోయిన్ ఈషా గుప్తా
  • తెల్లగా కన్పించేందుకు , ఫెయిర్ స్కిన్ కలర్ కోసం ఇంజెక్షన్లు వాడమని ఒత్తిడి
  • ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు 9 వేల రూపాయలు
Esha Gupta: తెల్ల రంగు కోసం 9 వేల ఖరీదైన ఇంజెక్షన్లు వాడిన రామ్‌చరణ్ హీరోయిన్, ఒత్తిడి ఉండేదన్న ఈషా గుప్తా

Esha Gupta: బాలీవుడ్ హాట్ నటి, రామ్‌చరణ్ హీరోయిన్ తెల్లగా కన్పించేందుకు ఖరీదైన ఇంజెక్షన్లు తీసుకునేదా..కెరీర్ ప్రారంభంలో అలా చేయమని ఆమెపై ఒత్తిడి చేసిందెవరు. బాలీవుడ్‌లో ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 

బాలీవుడ్‌లో జన్నత్ 2 సినిమాతో  2012లో ఎంట్రీ ఇచ్చిన ఈషా గుప్తా..షాకింగ్ నిజాలు వెల్లడించింది. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాల్ని వివరించింది. ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో ఏం జరిగిందో వెల్లడించింది. 36 ఏళ్ల ఈషా గుప్తా ప్రస్తుతం ఆశ్రమ్ 3 వెబ్‌సిరీస్‌లో నటించింది. తెల్లగా కన్పించేందుకు, రంగు కోసం అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లు తీసుకోమని సూచించారంటూ షాకింగ్ నిజాలు తెలిపింది. 

కెరీర్ ప్రారంభంలో తన స్కిన్ రంగు విషయమై ఎదురయ్యే ప్రశ్నలు, ఇబ్బందుల్ని గుర్తు చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో నా ముక్కును షార్ప్‌గా చేసుకోమని సూచించేవారు. నా ముక్కు గుండ్రంగా ఉందని అనేవారు. అంతకంటే ముందు స్కిన్ ఫెయిర్ కోసం ఖరీదైన ఇంజెక్షన్లు తీసుకోమని ఒత్తిడి తెచ్చేవారని తెలిపింది. ఆ ఇంజెక్షన్ ఒక్కొక్కటి 9 వేల రూపాయలని, ఆ ఇంజెక్షన్ పేరు చెప్పనని..కానీ చాలామంది హీరోయిన్లు స్కిన్ ఫెయిర్ కోసం తీసుకుంటారని ఈషా గుప్తా తెలిపింది. 

అందంగా కన్పించే విషయంలో హీరోయిన్‌లపై చాలా ఒత్తిడి ఉంటుందని..తన కూతురిని యాక్టర్ కానివ్వనని లేకపోతే తాను కూడా టీనేజ్ నుంచే అందంగా కన్పించే విషయమై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుందని వెల్లడించింది. సాధారణ జీవితం గడపలేదని తెలిపింది. తన కూతురు అథ్లెట్ కావాలనేది తన కోరికని చెప్పింది. చక్రవ్యూహ్, రాజ్ 3డి, రుస్తమ్, బాద్ షాహో వటి సినిమాల్లో ఈషా గుప్తా నటించింది. 2019లో చివరిసారిగా వెండితెరపై కన్పించిన ఈషా గుప్తా..ఆ తరువాత వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది. 

Also read: Pooja Jhaveri Pics: విజయ్ దేవరకొండ హీరోయిన్ అందాల జాతర.. చూపు తిప్పుకోవడం కష్టమే సుమీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News