Crane Accident: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రమాదం..ఐదుగురు దుర్మరణం..!

Crane Accident: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అప్రశృతి చోటుచేసుకుంది. క్రేన్ వైర తెగిపడ్డ ఘటనల ఐదుగురు మృతి చెందారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 29, 2022, 08:47 AM IST
  • నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం
  • ఐదుగురు మృతి
  • పలువురికి గాయాలు
Crane Accident: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రమాదం..ఐదుగురు దుర్మరణం..!

Crane Accident: నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగిపడింది. దీంతో అక్కడికక్కడే ఐదుగురు కార్మికులు మృత్యుఒడికి చేరారు. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

పంప్ హౌజ్‌లోకి దిగుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈప్రమాదంలో మరికొంతమందికి గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. గాయపడ్డ వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు బీహార్‌ చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ప్రమాదం గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:Ramarao on Duty: రామారావు ఆన్ డ్యూటీ లీక్డ్ వీడియో.. అధికార పార్టీకి మాస్ వార్నింగ్.. థియేటర్లు బద్దలే!

Also read:Allu Arjun: అల్లు అర్జున్ దూకుడు.. రోజుల వ్యవధిలో మూడో యాడ్!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News