అమెరికాలో ఘనంగా తెలుగు పోటీలు

.

Last Updated : Sep 8, 2017, 12:50 PM IST
అమెరికాలో ఘనంగా తెలుగు పోటీలు

చికాగో: సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు మాట్లాట  పోటీలు ఘనంగా జరిగాయి. చికాగో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 120 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన చిన్నారులకు ప్రఖ్యాత కవయిత్రి, డా. సొంఠి శారదా పూర్ణ, చిమట కమల బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మనబడి ప్రచార అధ్యక్షుడు రాయవరం విజయభాస్కర్‌, పలుకుబడి అధ్యక్షులు తోటపల్లి డాంజి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు మాట్లాట అధ్యక్షుడు నిడమర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు మాట్లాట పోటీలు పిల్లల భాషా ప్రావీణ్యానికి పదును పెట్టడమే కాకుండా వారిలో సృజనాత్మక శక్తిని, నాయకత్వపు లక్షణాలను పెంపొందిస్తుందన్నారు.

 విజేతలు: బుడతలు ( 5 నుంచి 9 ఏళ్ల పిల్లలు): ఆదిత్య ఉపాధ్యాయుల, హాసిని తోంటా, విధ గంజి
                 సిసింద్రీలు ( 10 - 14 ఏళ్ల పిల్లులు ): శ్రియ సిద్ధార్ధ, అరుల్ కొల్ల, లాస్య నెరయనూరి, శ్రీమయి పెద్దింటి

Trending News