మళ్లీ "మోదీ"యే ట్విట్టర్ రారాజు

ట్విట్టర్ ద్వారా ఎక్కువమంది అనుసరిస్తున్న భారతీయుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించింది.

Last Updated : Dec 6, 2017, 03:12 PM IST
మళ్లీ "మోదీ"యే ట్విట్టర్ రారాజు

ట్విట్టర్ ద్వారా ఎక్కువమంది అనుసరిస్తున్న భారతీయుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించింది. 2016లో మోదీకి ట్విట్టర్‌లో 24.6 మిలియన్ ఫాలోవర్లు ఉండేవారని, 2017లో ఆ సంఖ్య 52 శాతం పెరిగిందని ట్విట్టర్ పేర్కొంది. ప్రస్తుతం 37.5 మిలియన్ల ఫాలోవర్లు మోదీని ట్విట్టర్‌లో అనుసరిస్తున్నట్లు తెలిపింది. ఆయన తర్వాతి స్థానంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఉండడం విశేషం.

అలాగే మూడవ స్థానంలో షారుఖ్ ఖాన్ (31 మిలియన్లు), నాల్గవ స్థానంలో సల్మాన్ ఖాన్ (28.6 మిలియన్లు), ఐదవ స్థానంలో అక్షయ్ కుమార్ (22.9 మిలియన్లు) ఉండడం గమనార్హం. ఆరవ స్థానంలో అమీర్ ఖాన్ (22.4 మిలియన్లు), ఎనిమిదవ స్థానంలో సచిన్ టెండుల్కర్ (21.8 మిలియన్లు), తొమ్మిదవ స్థానంలో హృతిక్ రోషన్ (20.9 మిలియన్లు), పదవ స్థానంలో విరాట్ కోహ్లీ (20.8 మిలియన్లు) ఉండడం విశేషం. అలాగే టాప్ టెన్ లిస్టులో కేవలం ఒక భారతీయ వనితకే స్థానం దక్కిందంట. ఏడవ స్థానంలో నిలిచిన దీపికా పదుకొనేను 22.1 మిలియన్ల మంది ఫాలోవర్లు అనుసరిస్తున్నారట. 

 

Trending News