Petrol Tank Blast Fact Check: ఎండాకాలం బండ్లలో పెట్రోల్ ట్యాంక్​ ఫుల్​ చేస్తే ప్రమాదమా?

Petrol Tank Blast Fact Check: ఎండాకాలంలో బైక్​లు, కార్లలో పెట్రోల్​, డీజిల్ ట్యాంక్ ఫుల్ కొట్టించొద్దా? అలా కొట్టించడం వల్ల పెలుళ్లు సంభవిస్తాయా? దీనిపై ఇండియన్ ఆయిల్​ వాహనదారులకు సూచనలు చేసిందా? ఫ్యాక్ట్​ చెక్​.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 07:19 PM IST
  • ఎండాకాలంలో పెట్రోల్​, డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించొద్దా?
  • వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయిస్తే పెలిపోతాయా?
  • ఐఓసీ పేరుతో వైరల్ అవుతున్న వార్నింగ్ మెసేజ్​..
Petrol Tank Blast Fact Check: ఎండాకాలం బండ్లలో పెట్రోల్ ట్యాంక్​ ఫుల్​ చేస్తే ప్రమాదమా?

Petrol Tank Blast Fact Check: సోషల్​ మీడియాలో వార్తల అప్​డేట్స్ అత్యంతవేగంగా వస్తుంటాయి. చాలాసార్లు మెయిన్​ స్ట్రీమ్​ మీడియాకంటే ముందే సోషల్​ మీడియాలో అప్​డేట్స్ వస్తుంటాయి. అయితే అందులో నిజాలతో పాటు చాలాసార్లు తప్పుడు వార్తలు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు చాలా వార్తలు ట్రెండ్​ కూడా అవుతుంటాయి. అయితే అందులో నిజమెంత అనేది తెలుసుకోకుండా చాలా మంది వాటని నమ్ముతుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో ఓ వార్త ట్రెండవుతోంది. వాట్సాప్​, ఫేస్​బుక్​లలో తెగ ఫార్వర్డ్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్తలో ఏముంది?

తాజాగా ఓ వార్త చమురు మార్కెటింగ్ సంస్థ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేరుపై ట్రెండవుతోంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఇంకా ఆరంభ దశలోనే రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులను ఐఓసీ హెచ్చరిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోది.

'ఎండలు మండపోతున్నందున వాహనాల్లో పెట్రోల్​ లేదా డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించకండి. దీనివల్ల పేలుళ్లు సంభవించే ప్రమాదముంది. ఇప్పటికే ఈ వారంలో 5 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోజులో కనీసం ఒకసారైనా పెట్రోల్ ట్యాంక్ తెరవడం ద్వారా లోపల ఉండే గ్యాస్ బయటకు వస్తుంది. ఈ విషయాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపండి' అనేది ఆ ఫార్వర్డ్ సమాచారంలోని సమాచారం.

ఈ వార్తలో నిజమెంత?

తమ సంస్థ పేరుమీద ఈ వార్త వైరల్​ అవుతున్న నేపథ్యంలో ఐఓసీ క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఇదే విషయమై 2019లోనే క్లారిటీ ఇచ్చింది సంస్థ. తాజాగా మరోసారి ఇదే వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అప్రమత్తమైంది. తాము ఇలాంటి హెచ్చరికను జారీ చేయలేదని స్పష్టం చేసింది. సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నకిలీదని తేల్చి చెప్పింది. తాము ఎప్పుడు అలాంటి ప్రకటన చేయలేదని వివరించింది.

ఆటోమొబైల్ కంపెనీలు.. వాహనాన్ని తయారు చేసేటప్పుడు అన్ని పరిస్థితులను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటాయని.. అందువల్ల ఎండాకాలంలో ట్యాంక్​ ఫుల్ చేయిస్తే పెలుళ్లు సంభవిస్తాయనేది తప్పుడు వాదన అని కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను నమ్మొద్దని సూచించింది.

Also read: Pushpa in Exam: ఆన్సర్​ షీట్​లో 'పుష్ప పుష్ప రాజ్​' డైలాగ్​.. వైరల్ అవుతోన్న ఫొటో

Also read: Optical Illusion Photo: ఈ చిత్రంలో రెండు వేర్వేరు జీవులు ఉన్నాయి- అవేంటో మీరు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News