బౌలింగ్ చేస్తూ.. యువ క్రికెటర్ మృతి

బౌలింగ్ వేస్తూ ఓ యువ క్రికెటర్ మైదానంలో మృతిచెందాడు.

Last Updated : Jan 28, 2018, 11:18 PM IST
బౌలింగ్ చేస్తూ.. యువ క్రికెటర్ మృతి

బౌలింగ్ వేస్తూ ఓ యువ క్రికెటర్ మైదానంలో మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో చోటుచేసుకుంది. బంగారు తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా రెండు రోజుల క్రితం రాత్రి క్రికెట్ ఆడుతున్న లాయిడ్ అంథోని(23) అనే యువకుడు బౌలింగ్ చేస్తూ కుప్పకూలాడు. తనవంతు బౌలింగ్ రాగానే మొదటి రెండు బంతులు బాగానే వేశాడు. మూడో బంతి వేసేటప్పుడు ఆకస్మికంగా కిందపడిపోయాడు. 

వెంటనే అక్కడున్న తోటి ఆటగాళ్లు లాయిడ్ ను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే లాయిడ్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. లాయిడ్ హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. సరదాగా క్రికెట్ ఆడుతూ ఇలా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Trending News