యాషెస్ సిరీస్‌లో కంగారూలకే పట్టం..!

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 4-0 పాయింట్లతో కైవసం చేసుకుంది.

Last Updated : Jan 8, 2018, 08:13 PM IST
యాషెస్ సిరీస్‌లో కంగారూలకే పట్టం..!

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 4-0 పాయింట్లతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా  విజయభేరి మోగించింది. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను ఆ జట్టు 4-0 పాయింట్లతో నెగ్గి ప్రత్యర్థిని మట్టికరిపించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా.. అంతిమ విజేతగా ఆసీస్ మాత్రమే నిలిచింది. చివరి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకొన్నా.. 346 పరుగులకే ఆలౌట్ అవ్వడం ఆసీస్‌కు కలిసొచ్చింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగి 649/7 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

ఆ జట్టు తరఫున డేవిడ్‌ వార్నర్‌(56), కవాజా(171), స్మిత్‌(83), షాన్‌ మార్ష్‌(156), మిచెల్‌ మార్ష్‌(101) తదితరులు పరుగుల వరదతో నిజంగానే ఇంగ్లాంగ్ బౌలర్లను బెంబేలెత్తించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్  180 పరుగులకే కుప్పకూలడంతో  ఆసీస్‌ దిగ్గజం స్మిత్‌ "మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌" అందుకున్నాడు. అదేవిధంగా ఆసీస్‌ 104 పాయింట్లతో ప్రస్తుత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి ఎగబాకడం విశేషం.

Trending News