Virender Sehwag Tweet on Adipurush: ఆదిపురుష్‌ మూవీపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్.. వైరలవుతున్న ట్వీట్!

Virender Sehwag Tweet on Adipurush: ఆదిపురుష్ మూవీ ట్రోలింగ్ ఆగడం లేదు. తాజాగా కట్టప్ప-బాహుబలి జోక్‌తో ఆదిపురుష్‌ను పోలుస్తూ.. వీరేంద్ర సెహ్వాగ్ సైటరికల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 27, 2023, 04:35 PM IST
Virender Sehwag Tweet on Adipurush: ఆదిపురుష్‌ మూవీపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్.. వైరలవుతున్న ట్వీట్!

Virender Sehwag Comments on Prabhas Adipurush Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన మూవీ ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాక్సాఫీసు వద్ద నిరాశను మిగిల్చింది. ఫలితం సంగతి పక్కనబెడితే ట్రోలింగ్ మాత్రం ఓ రేంజ్‌లో జరుగుతోంది. కథ, పాత్రలను తీర్చిదిద్దిన విధానం, వీఎఫ్ఎక్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డైలాగ్స్‌పై వివాదం నెలకొంది. కొన్ని డైలాగ్స్ మార్చినా.. అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గడం లేదు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆదిపురుష్‌పై స్పందించాడు. తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశాడు.

ఆదిపురుష్ మూవీ చూసిన తరువాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైంది అంటూ రాసుకొచ్చాడు. ఆదిపురుష్‌ మూవీని ప్రభాస్ ఒప్పుకున్నందుకు కట్టప్ప చంపేశాడనే అర్థం అర్థం వచ్చేలా వీరూ ఈ క్యాప్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్ల భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది కాపీ జోక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
మీ స్థాయిలో ఉన్న  వ్యక్తి ఇలా ఓ మూవీపై ఇలాంటి ట్వీట్ చేయడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ఇది పెయిడ్ ట్వీట్ అంటున్నారు. మరికొందరు సెహ్వాగ్ ట్వీట్‌ నిజమే అంటున్నారు. నవ్వుతూ రిప్లై ఇస్తున్నారు.

Also Read: Shriya Saran:  అందాల బాంబ్ పేల్చిన శ్రియా.. ఉర్పీ జావేద్ కాపీ అంటూ ట్రోలింగ్

టీజర్, ట్రైలర్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఆదిపురుష్ భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. జూన్ 16న ఆడియన్స్ ముందుకు రాగా.. పూర్తిగా నిరాశపర్చింది. దాదాపు రూ.500 కోట్లతో రూపొందించిన ఈ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్.. జానకీదేవిగా కృతి సనన్ యాక్ట్ చేశారు. రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా.. తొలి మూడు రోజులు మాత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఆదిపురుష్.. ఆ తరువాత కలెక్షన్ల పరంగా వెనుకబడిపోయింది. ఇప్పటివరకు మొత్తం రూ.400 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. తెలుగులో 100 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఆదిపురుష్ నిరాశపర్చడంతో ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టిపెట్టాడు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని చెప్పిన ప్రభాస్.. అందుకు తగినట్లే తరువాతి మూవీ సలార్‌ మూవీలో బిజీ అయిపోయాడు. ఈ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. బాహుబలి సిరీస్‌ తరువాత సరైన హిట్ కోసం ప్రభాస్ అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది. సలార్‌ సినిమాతో మొత్తం కవర్ అవుతుందని ధీమా వ్యక్త చేస్తున్నారు.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News