SRH vs RR: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో చెలరేగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ గట్టిషాకిచ్చింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ఓటమి రుచి చూపించింది.
Abhishek Sharma Ducks Out: పంజాబ్ లయన్.. అభిషేక్ శర్మ అంటేనే మైదానంలో సిక్సర్ల వర్షం గుర్తుకు వస్తుంది. క్రీజులోకి వచ్చాడంటే చాలు.. బౌలర్ ఎవరైనా లెక్కచేయకుండా బంతిని బౌండరీ అవతలకు పంపించడమే లక్ష్యంగా విరుచుకుపడాడు. 2024 ఐపీఎల్లో చెలరేగిపోయిన ఈ యువ సంచలనం.. తన పవర్ఫుల్ హిట్టింగ్తో ప్రత్యర్థులను వణికించాడు. స్ట్రైక్ రేట్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ.. టీమ్ ఇండియాకు భవిష్యత్ స్టార్గా ఎదిగాడు. కానీ ఇప్పుడు ఏమైంది.. పరుగుల వరద పారిస్తాడనుకుంటే.. డకౌట్ల సునామీని క్రియేట్ చేస్తున్నాడు. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో 16వ సారి డక్ అయ్యాడు.
Ms Dhoni Miss The First Two Weeks Of IPL 2026: ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు బ్యాడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటను చూడాలని అనుకున్న ఫ్యాన్స్కు నిరాశ తప్పడం లేదు. ధోని పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా, న్యూజిలాండ్ తలపడనుండగా.. టాస్ గెలిచిన కివీస్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. మరి ఈ మ్యాచ్లో గెలిచిన టీమ్కు ప్రైజ్ మనీ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
India Vs Pakistan Match: చిరకాల ప్రత్యర్థి పాక్తో మ్యాచ్కు భారత్ సిద్ధమైంది. నేడు కొలంబో వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. మ్యాచ్కు ముందు పాకిస్తాన్ డగౌట్లో పాము కనిపించడం కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం పాక్ టీమ్ ప్రాక్టీస్ కోసం వస్తున్న సమయంలో పాము కన్పించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ సిబ్బంది వెంటనే పామును అక్కడి నుండి తొలగించారు.
Cricket Retirements in 2026: టీమిండియాలో ఓ వెలుగు వెలిగిన చాలా మంది స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నారు. యువకుల నుంచి పోటీ.. పేలవ ఫామ్ కారణంగా టీమ్లో చోటు కోల్పోయారు. దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసినా.. వయసు ప్రభావం కారణంగా తిరిగి టీమ్లోకి రావాడం దాదాపు కష్టమే. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికే అవకాశం ఉన్న ఐదుగురు ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
Smriti Mandhana: ముంబై ఇండియన్స్తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 ఓపెనర్ మ్యాచ్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధానకు ఓ కెమెరామెన్ చిరాకు తెప్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో లేడీ కోహ్లీ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ కెమెరామెన్ ఆమెను ఫోటోలు తీస్తున్నాడు. మంధాన త్రోడౌన్లను ఎదుర్కొంటుండగా.. సదరు కెమెరామెన్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. దీంతో మంధాన కాస్త అహసనానికి గురైంది. ఏంటి ఇది అన్నట్లుగా సైగ చేసింది. ఆ సమయంలో స్మృతి మంధాన ముఖంలో చిరాకు చాలా స్పష్టంగా కనిపించింది.
Ahmar Khan: ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా అహ్మర్ ఖాన్ అనే బౌలర్ మ్యాచ్ చివరి బాల్ వేసి.. తన జట్టును గెలిపించి గుండెపోటుతో.. పిచ్పై కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన మొరాదాబాద్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో చోటుచేసుకుంది.
Smriti Mandhana Record: టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా అక్టోబర్ 9న జరిగిన దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి మంధాన ఈ రికార్డు సాధించింది.
Team India Squad For Australia Tour: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను మరోసారి కలిసి చూసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత వీరిద్దరూ క్రికెట్ మ్యాచ్ల్లో అసలు కనిపించలేదు. రిటైర్మెంట్ కారణంగా వీరిద్దరూ ఇతర టీ20, టెస్టు ఫార్మాట్లలో కనిపించడం లేదు. ఈ క్రమంలో వాళ్ల ఫ్యాన్స్ కు హుషారెత్తించే వార్త వచ్చింది.
Rishabh Pant Birthday: చిన్న పట్టణం నుంచి గురుద్వారాలో బస చేస్తూ, లంగర్లో తింటూ ప్రాక్టీస్ చేసిన కుర్రాడు నేడు టీమ్ ఇండియాలో స్టార్ వికెట్ కీపర్గా వెలుగొందుతున్నాడు. 18 ఏళ్లకే అండర్-19 వరల్డ్ కప్లో సెంచరీతో పాటు ఐపీఎల్ వేలంలో కోట్ల వర్షం కురిపించిన రిషబ్ పంత్, 2022లో ప్రమాదంలో గాయపడినా కేవలం 15 నెలల్లోనే కోలుకుని టీ20 ప్రపంచ కప్ గెలిపించాడు. అతని జీవితం కష్టాలు, పోరాటం, విజయాలతో నిండిన అసలైన ప్రేరణ కథ అని చెప్పవచ్చు. నేడు టీమిండియా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ పంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జీ తెలుగు స్పోర్ట్స్ విభాగం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తోంది. హ్యాపీ బర్త్
Ravindra Jadeja: భారత జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో టీమిండియా తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్స్ లిస్ట్లో నాలుగవ స్థానానికి చేరుకున్నాడు. దీంతో జడేజా.. ఈ జాబితాలో ఉన్న ధోనిని అధిగమించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Team India sponsor: టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది. 2027 వరకు అపోలో టైర్స్ భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ఇంతకముందు ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ టీమిండియా జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించింది. అయితే.. ఇటీవల ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో తమ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుంది.
Asia Cup 2025 India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్-పాక్ జట్ల మధ్య జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ పై ప్రస్తుతం రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ ను భారత్ లో బహిష్కరించాలని పిలుపునిస్తున్నారంటూ కొన్ని మీడియా ఛానెల్స్ కథనాలు వినిపించాయి. పహల్గామ్ ఘటన కారణంగా టికెట్లు అమ్ముడుపోలేదని..అభిమానుల్లో ఉత్సాహం తగ్గిందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి.
Cricket Retirement Pension: క్రికెటర్ నయా వాల్ అని పేరొందిన టెస్టు క్రికెట్ స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా ఇటీవలే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడిని వీడ్కోలు పలుకుతూ క్రికెట్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే అతని గురించి చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. పుజారా ఎవరు? ఏ ఊరు? పుజారా కుటుంబం గురించి ఎంతో మంది సెర్చ్ చేస్తున్నారు. పుజారా జీతం ఎంత? ఎంత సంపాదించాడు? వంటి సమాచారాల గురించి వెతుకుతున్నారు.
Top 10 Star Player Retirement In 2025: ఈ ఏడాది చాలామంది దిగ్గజ క్రికెటర్ల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే.. తాజాగా మరో దిగ్గజ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా కెరీర్కు వీడ్కోలు పలికాడు. ప్రపంచవ్యాప్తంగా 2025లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లపై ఓ లుక్కేయండి.
Siraj Energy Secret: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టెండుల్కర్ - అండర్సన్ ట్రోఫీ 2-2 తో టీమిండియా డ్రా చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఒకరు చెప్పవచ్చు. మొహమ్మద్ సిరాజ్ వరుసగా 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. చివరి మ్యాచ్లో ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు గెలుచుకున్నాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు ఫిట్నెస్ అనేది ఒక పెద్ద సవాలు వంటిది. ఈ నేపథ్యంలో సిరాజ్ వరుసగా ఇన్ని మ్యాచులు ఆడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సిరాజ్ ఫిట్నెస్ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అభిమానులు క్రికెట్ నిపుణులు సైతం ఆసక్తి చూపించారు.
IND vs ENG : ఇంగ్లండ్ తో 2025లో ఓవల్ లో జరిగిన 5వ టెస్టు మ్యాచులో భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ తన ప్రవర్తనతో వివాదంలో చిక్కాడు. ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ ను ఔట్ చేసిన తర్వాత ఆకాశ్ దీప్ అతని భుజంపై చేయి వేసి..ఎగతాళి చేసిన ఘటన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు కోపం తెచ్చేలా చేసింది. ఈ ఘటనపై పాంటింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశ్ దీప్ ప్రవర్తన సరైంది కాదంటూ ఫైర్ అయ్యాడు.
Indian Probable Playing XI for 5th Test: మాంచెస్టర్ టెస్ట్ను డ్రా చేసుకోవడం ద్వారా సిరీస్ను కాపాడుకోవాలనే ఆశను భారత్ సజీవంగా ఉంచుకుంది. కానీ ఇప్పటికీ 1-2తో వెనుకబడి ఉంది. ఓవల్ టెస్ట్కు ముందు పంత్-బుమ్రా లేకపోవడం, పేలవమైన ఫామ్తో జట్టు ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్లో భారత ప్లేయింగ్ XIలో కనీసం నాలుగు మార్పులు జరిగే అవకాశం ఉంది.
Ravindra Jadeja: ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగవ టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. తొలి నాలుగు రోజుల ఆటలో పేలవమైన ప్రదర్శన చేసినా..చివరి రోజు మాత్రం వీరోచితంగా పోరాడింది టీమిండియా. డ్రా చేసుకుని గట్టెక్కిందని చెప్పవచ్చు. ఓవర్ నైట్ స్కోర్ 2 వికెట్లకు 174 పరుగులతో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన భారతజట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 424 పరుగులు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.