IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి వేళాయే- తేదీలను ఫిక్స్ చేసిన బీసీసీఐ

IPL Mega Auction: ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం (IPL 2022 Mega Auction) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలను ప్రకటించింది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ వేలంలో కొత్తగా చేరిన రెండు ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో పాల్గొంటాయని ఆయన అన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 08:27 AM IST
    • ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు
    • బెంగళూరులో ఫిబ్రవరి 12, 13న నిర్వహించనున్న బీసీసీఐ
    • వేలంలో పాల్గొననున్న అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు
IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి వేళాయే- తేదీలను ఫిక్స్ చేసిన బీసీసీఐ

IPL Mega Auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2022 Mega Auction) మెగా వేలాన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) తేదీలను ఖరారు చేసింది. వచ్చే నెలలో అనగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్‌ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. 

ఇటీవలే ఐపీఎల్ లో  చేరిన రెండు కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో 'లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్'ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బీసీసీఐ కూడా క్లియరెన్స్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ధ్రువీకరించారు.

"అహ్మదాబాద్, లక్నో ఫ్రాంఛైజీలకు సంబంధించిన రెండు బిడ్‌లను గవర్నింగ్‌ కౌన్సిల్ ఆమోదించింది. ఎల్‌వోఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)ను త్వరలోనే జారీ చేస్తాం. దీని వల్ల బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగబోయే మెగా వేలానికి ముందే రెండు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కలుగుతుంది" అని ఆయన వివరించారు.

ఇప్పటికే కొత్త ఫ్రాంచైజీలు తమ జట్లకు అవసరమైన సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకుంది. ఇక ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవడమే ఉంది. లఖ్‌నవూకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్‌ జట్టుకు హార్దిక్ పాండ్య సారథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. 

మరోవైపు కొత్త జట్లకు రెండు వారాల్లోగా ప్లేయర్లను ఎంచుకునే (IPL 2022 Mega Auction) వెసులుబాటు ఉందని బ్రిజేష్‌ పటేల్ తెలిపారు. "మేం కొత్త ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాట్లాడాం. వారికి ఆటగాళ్లను ఎంచుకునేందుకు పది రోజుల నుంచి రెండు వారాల సమయం ఇవ్వాలని భావిస్తున్నాం. అదేవిధంగా భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నాం. అయితే కొవిడ్‌ వ్యాప్తిని నిరంతరం గమనిస్తూనే ఉంటాం" అని ఐపీఎల్ ఛైర్మన్ (IPL Chairman) బ్రిజేష్ పటేల్ అన్నారు.  

Also Read: Harbhajan on Kohli: సౌతాఫ్రికాతో మూడో టెస్టులో వింటేజ్ కోహ్లీని చూస్తారు: హర్భజన్

Also Read: IPL New Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్.. తప్పుకున్న వివో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News