Pakistan Openers Record: టీమ్ ఇండియా మ్యాచ్‌తో సరికొత్త రికార్డు సాధించిన పాక్ ఓపెనర్లు

Pakistan Openers Record: చక్కని ఆటతీరు, సరైన ఎటాకింగ్ స్టైల్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. దాయాదుల పోరులో సుదీర్ఘకాలం తరువాత విజయం అందుకుంది. టీమ్ ఇండియాపై విజయంతో పాకిస్తాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 25, 2021, 06:17 AM IST
  • టీమ్ ఇండియా మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్
  • టీ 20 మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున ఏ వికెట్‌కైనా అత్యధిక స్కోరు ఇదే
  • టీ20 మ్యాచ్‌లలో వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగుల లక్ష్యం సాధించిన ఘనత దక్కించుకున్న పాకిస్తాన్
Pakistan Openers Record: టీమ్ ఇండియా మ్యాచ్‌తో సరికొత్త రికార్డు సాధించిన పాక్ ఓపెనర్లు

Pakistan Openers Record: చక్కని ఆటతీరు, సరైన ఎటాకింగ్ స్టైల్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. దాయాదుల పోరులో సుదీర్ఘకాలం తరువాత విజయం అందుకుంది. టీమ్ ఇండియాపై విజయంతో పాకిస్తాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.

ICC T20 World Cup 2021లో క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూసిన మ్యాచ్ ముగిసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియంలో జరిగిన దాయాదుల పోరులో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. టీమ్ ఇండియా వర్సెస్ టీమ్ పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చరిత్ర తిరగరాసింది. ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup)ఇండియాపై తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam)పేరున ఉన్న రికార్డు కొనసాగింది. పాకిస్తాన్ ఓపెనర్లు సరికొత్త రికార్డు సాధించారు. 

అక్టోబర్ 24న జరిగిన టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్(India-pakistan match)మ్యాచ్‌లో విజయానికి కారణం పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan)లే. చక్కని ఆటతీరు, ఎటాకింగ్ స్టైల్‌తో, కూల్‌గా ఆడుతూ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించారు. టీమ్ ఇండియా(Team India)విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేధించారు. ఎక్కడా ఒక్క లైఫ్‌లైన్ లేకుండా..వికెట్ కోల్పోకుండా ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడినట్టుగా కన్పించింది. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ ఓపెనర్లు(Pakistan Openers)రికార్డు సృష్టించారు. తొలి వికెట్‌కు 152 పరుగులు సాధించిన ఘనత దక్కించుకున్నారు. టీ20 మ్యాచ్‌లలో పాకిస్తాన్ తరపున ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. అంతకుముందు 2012 టీ20 మ్యాచ్‌లో మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ జంట నాలుగో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం. ఇక ఓపెనర్లు లక్ష్యాన్ని ఛేధించిన పరిస్థితి టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు మాత్రమే జరిగింది. గతంలో 2007లో శ్రీలకంపై 102,2012లో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా జట్టు 94, 2021లో పుపువా న్యూ గినియాపై ఒమన్ జట్టు 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాయి.152 పరుగుల లక్ష్యాన్ని సాధించడం ద్వారా వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగులు ఛేధించిన ఘనతను పాకిస్తాన్ దక్కించుకుంది. 

Also read: T20 WC 2021 IND Vs PAK: చెలరేగిన బాబర్, రిజ్వాన్..భారత్ పై పాక్ గెలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News