కోపంతో సేహ్వాగ్‌పై చిందులేసిన ప్రీతీజింతా.. అది నిజం కాదన్న ఫ్రాంచైజీ!

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీరేంద్ర సేహ్వాగ్-ప్రీతిజింతాల వివాదం

Last Updated : May 12, 2018, 12:54 PM IST
కోపంతో సేహ్వాగ్‌పై చిందులేసిన ప్రీతీజింతా.. అది నిజం కాదన్న ఫ్రాంచైజీ!

కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ జట్టు కోచ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌పై‌, ఆ జట్టు యజమాని, బాలీవుడ్ నటి ప్రీతిజింతా చిందులేసిందని, రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో ఓటమి తర్వాత సేహ్వాగ్‌పై ప్రీతి రుసరుసలాడిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ప్రీతిజింతా వైఖరితో మనస్తాపానికి గురైన సేహ్వాగ్ ఆ జట్టుతో మరోసారి అగ్రిమెంట్ కుదుర్చుకోకూడదు అని నిశ్చయించుకున్నాడనేది ఆ వార్తల సారాంశం. అయితే, సొట్ట బుగ్గల సుందరి ప్రీతిజింతా మాత్రం అటువంటిదేం లేదని కొట్టిపారేసింది. ఈ వివాదంపై ఓ ట్వీట్‌ చేసిన ప్రీతిజింతా.. అసత్య కథనాలను ప్రచురించొద్దంటూ మీడియాపై అసంతృప్తి వ్యక్తంచేసింది. 

వీరేంద్ర సేహ్వాగ్‌పై తాను ఆగ్రహం వ్యక్తంచేశానని లేనిపోని ఆవాస్తవాలు రాయొద్దంటూ ప్రీతి తన ట్వీట్‌లో పేర్కొంది. ఈ వివాదం తారాస్థాయికి చేరకముందే మేలుకోవాలనుకుందో ఏమో కానీ ప్రీతిజింతా ట్వీట్‌ అనంతరం కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీ సైతం ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రీతి జింతా-సెహ్వాగ్‌ల మధ్య గొడవ జరిగినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ ఆ ప్రకటనలో స్పష్టంచేసింది.

Trending News