Rohit Sharma: ఆ మూడూ కొట్టేస్తే.. హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డ్​!

భారత ఆటగాళ్లలో సిక్సర్లు అలవోకగా కొట్టేలంటే..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా. ఇప్పుడీ ఈ స్టార్ ప్లేయర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్దమయ్యాడు. రోహిత్ మరో మూడు సిక్సర్లు బాదేస్తే టీ20ల్లో 400 సిక్సర్లు బాదిన మొదటి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2021, 05:05 PM IST
  • టీ20ల్లో 397 సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్
  • మరో మూడు బాదితే 400 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్ గా రికార్డ్
  • 1042 సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో గేల్
Rohit Sharma: ఆ మూడూ కొట్టేస్తే.. హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డ్​!

Rohit Sharma Three Sixes Away To Record 400 Sixes In T20s: భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన ఘనతను సాధించేందుకు చేరువలో ఉన్నాడు. టీ20ల్లో ఇప్పటివరకూ 397 సిక్సర్లు బాదిన హిట్‌ మ్యాన్‌.. మరో మూడు సిక్సర్లు కొడితే, ఈ ఫార్మాట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. నేటి నుంచి ప్రారంభంకానున్న రెండో దశ ఐపీఎల్‌-2021 తొలి మ్యాచ్‌లోనే రోహిత్‌(Rohit Sharma) ఈ ఘనతను సాధించే అవకాశం ఉంది.

అందనంత ఎత్తులో గేల్..
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌(Chris Gayle) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గేల్‌ ఏకంగా 1042 సిక్సర్లు బాది ఈ జాబితాలో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గేల్‌ తర్వాతి స్థానాల్లో విండీస్‌ యోధులు పోలార్డ్‌(755), ఆండ్రీ రసెల్‌(509) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో రోహిత్‌(397) ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్‌ కంటే ముందు ఆరోన్‌ ఫించ్‌(399), ఏబీ డివిలియర్స్‌(430), షేన్‌ వాట్సన్‌(467), బ్రెండన్‌ మెక్‌కలమ్‌(485) ఉన్నారు. ఇక పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ క్రికెటర్ల విషయాకొస్తే.. ఈ లిస్ట్‌లో రోహిత్‌ తర్వాతి స్థానాల్లో సురేశ్‌ రైనా(324), విరాట్‌ కోహ్లి(315), ఎంఎస్‌ ధోని(303) ఉన్నారు.  ​

Also Read: IPL 2021: మళ్లీ ఐపీఎల్ పండగ వచ్చేసింది...ఇవాళ్టి నుంచి రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం

ఇదిలా ఉంటే,  క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2021(IPl-2021) రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్‌(Covid-19) కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో పునః ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై(10), బెంగళూరు(10), ముంబై(8) జట్లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News