మీడియాపై విరాట్ కోహ్లీ ఫైర్

దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓడిపోయాక, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్న మీడియా సమావేశంలో ఆయన ఓ విలేకరిపై ఫైర్ అయ్యారు.

Last Updated : Jan 18, 2018, 12:25 PM IST
మీడియాపై విరాట్ కోహ్లీ ఫైర్

దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓడిపోయాక, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్న మీడియా సమావేశంలో ఆయన ఓ విలేకరిపై ఫైర్ అయ్యారు. ఫీల్డింగ్ విషయానికి వస్తే బెస్ట్ 11 అనే విధంగా క్రీడాకారులందరూ రాణించారా అన్న ప్రశ్న పట్ల కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. "అసలు బెస్ట్ 11 అంటే ఏమిటి? ఒకవేళ మేము సిరీస్ గెలిస్తే.. బెస్ట్ 11 గా ఈ జట్టును పరిగణిస్తారా? మేము ఫలితాలను బట్టి టీమ్ డిజైన్ చేసుకోము. ధైర్యముంటే ఎలాంటి 11 మంది ఆటగాళ్ళను టీమ్‌లోకి తీసుకొని ఆడించాలో మీ మీడియా వాళ్లే చెప్పండి. వారిని తీసుకొని ఆడిస్తాము" అని తన అసహనాన్ని వ్యక్తం చేశారు కోహ్లీ. "నా మాటలు మిమ్మల్ని బాధకు గురి చేస్తాయని నాకు తెలుసు. కానీ బెస్ట్ 11 గా పరిగణించదగ్గ భారత జట్లు కూడా స్వదేశంలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక మీరు చెప్పేది కరెక్ట్ కాదు" అని కోహ్లీ అభిప్రాయపడ్డారు. 

Trending News