IRCTC ∣ ఐఆర్సీటిసిలో అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ చిట్కాలను పాటించి రైల్వే టికెట్లను ఒకే ఒక్క ఫోన్ కాల్ తో రద్దు చేసుకుని రీఫండ్ పొందవచ్చు.
IRCTC QUIZ: భారతీయ రైల్వే ప్రయాణికులను ( IRCTC ) ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. చాలా మంది దీనికి సరైన సమాధానం చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. లాక్డౌన్ సమయంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచనలు చేయడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని షేర్ చేస్తోంది.
Cancelled tickets money: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
List Of Trains To Andhra Pradesh | జూన్ 1 నుంచి దేశ వ్యాప్తంగా 200 రోజువారీ రైలు సర్వీసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. తొలుత స్లీపర్ బోగీలలో రిజర్వేషన్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్ టికెట్లు 200 మేర జారీ చేయనున్నారు.
రైలు సేవల పునరుద్ధరణతో ఇండియన్ రైల్వే ( Indian Railways ) మే 11 నుంచి టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్సిటిసి ( IRCTC ) ద్వారా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేపడుతోందనే విషయం తెలియడంతో దేశం నలుమూలలా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైలు టికెట్స్ కోసం పోటీపడ్డారు.
టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ నగదు ఎలా అని కంగారు చెందాల్సిన పనిలేదంటూ ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఆన్ లైన్లో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోకుండానే పూర్తి నగదు ప్రయాణికులకు అందిస్తామని ప్రకటించింది.
సమాచార హక్కు చట్టం కింద ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే అధికారులు ఈ వివరణ ఇచ్చారు. 2014 నుంచి ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఇదే తొలిసారి.
భారతీయ రైల్వే సరికొత్త ఆలోచనతో రామాయణ ఎక్స్ప్రెస్ పేరుతో మరో కొత్త రైలును ప్రవేశపెట్టబోతోంది. ఇందులో ప్రయాణించేవారికి రామాయణ కాలం గుర్తొచ్చే విధంగా భక్తి పారవశ్యంతో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు బోగీల లోపల రామాయణ కావ్యానికి ప్రతీక అనే విధంగా అలంకరణ ఉంటుందని, భజనలు వినిపిస్తాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు.
గతేడాది టికెట్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికుల వద్ద నుంచి ఓ టీసీ రికార్డు స్థాయిలో రూ.1.51 కోట్ల జరిమానా వసూలు చేశాడు. మరో ముగ్గురు టీసీలు కోటి రూపాయలకు పైగా జరిమానాల నగదు రైల్వేశాఖకు అందించారు.
నిర్వహణ లోపాల కారణంగా ఇండియన్ రైల్వే ఈ ఆదివారం 321 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రద్దు అయిన వాటిలో అధికంగా ప్యాసింజర్ రైళ్లే ఉన్నాయి. అదే సమయంలో ఇంకొన్ని ఎక్స్ప్రెస్ రైలు సేవలను సైతం రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే తెలిపింది. దేశ వ్యాప్తంగా వున్న వివిధ జోన్లలో జరుగుతున్న మరమ్మతులే ఈ నిర్ణయానికి కారణం అని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం.. రద్దు అయిన రైళ్ల వివరాలతో కూడిన జాబితాను నేషనల్ ట్రెైన్ ఎంక్వైరీ సిస్టం (ఎన్.టి.ఎస్) అధికారిక వెబ్సైట్పై ఇండియన్ రైల్వే విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.