విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం మళ్లీ స్పష్టం చేసింది.ఇదే విషయం మార్చి 12న జరిగిన రైల్వే అధికారుల రివ్యూ మీటింగులో చెప్పామని కూడా కేంద్రం ప్రకటించింది.
ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపుబడ్డ తాజ్మహల్ మనకు ఎప్పటికీ వెలకట్టలేని ఆస్తిగానే మిగిలిపోతుంది. అలాంటి అందమైన,చిరస్మరణీయమైన కట్టడంపై పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇది సామన్య జనాల వాయిస్ కాదు ..ఏకంగా అత్యున్నత ధర్మాసనమే చెప్పింది.
జాతీయ స్థాయిలో దేశంలోని ప్రముఖ లా కాలేజీలలో ప్రవేశానికి గాను నిర్వహించే పరీక్ష క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్టు) ఫలితాలను గురువారం అధికారికంగా అధికారులు విడుదల చేశారు.
కర్ణాటక రాజకీయాలు మళ్లీ కీలక మలుపు తిరిగాయి. ప్రొటెమ్ స్పీకరు విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపిన క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తన అభిప్రాయాలు తెలిపింది
కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రోటెమ్ స్పీకర్గా నామినేట్ చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఉత్తర్వులు జారీచేశారు. రేపు శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి, జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మధ్య జరగనున్న బల పరీక్షను ప్రొటెమ్ స్పీకర్గా నామినేట్ అయిన కేజీ బోపయ్య పర్యవేక్షించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4 గంటలకు బల పరీక్ష నిర్వహించి బీజేపీ తమ మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్ర సర్కార్ ఈ బల పరీక్షకు వెళ్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.