Telangana: ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. మూడు నెలల చిన్నారి మృతి..

ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటేసింది. పాముకు కాటుకు మూడు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 02:19 PM IST
Telangana: ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. మూడు నెలల చిన్నారి మృతి..

Crime News: ఒకే ఇంట్లో ఏకంగా ముగ్గుర్ని పాము(Snake Bite) కాటేసింది. పాము కాటుకు చిన్నారి మృతి చెందగా.. దంపతులు ఇద్దరు చావుబతుకుల మధ్య ఉన్నారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్‌ జిల్లా((Mahabubabad District) శనిగరపురానికి చెందిన క్రాంతి, మమత భార్యభర్తలు. వారికి మూడు నెలల పాప ఉంది. శనివారం రాత్రి పాపతో కలిసి దంపతులు నిద్రపోయారు. పాము ఎక్కడ్నుంచి.. ఎలా వచ్చిందో తెలియదు.. కానీ మంచంలోకి దూరింది. ఆ సమయంలో పసికందును పాము(Snake) కాటేయడంతో ఏడవటం ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఏమైందో అని లేచి.. చూస్తున్నారు. ఈ క్రమంలో పాప దుస్తుల్లోకి దూరిన పాము.. భార్యాభర్తలిద్దరినీ కూడా కాటేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

Also read: Rarest of Rare: తోకతో జన్మించిన శిశువు, బ్రెజిల్ లో ఘటన

వెంటనే ముగ్గురిని మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తరలిస్తున్న క్రమంలోనే చిన్నారి(Baby) మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మూడు నెలల చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే ఇంట్లో పాము ముగ్గురిని కాటేయడం, చిన్నారి మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News