Sabitha Indra Reddy: తెలంగాణలో అన్ని పరీక్షలు దసరా వరకు వాయిదా

Telangana Exams Postponed | తెలంగాణలో ( Telangana) ప్రస్తుతం నెలకొన్న పరిస్థితలను గమనించి అన్ని పరీక్షలను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ( Sabitha Indra Reddy) ప్రకటించారు.

Last Updated : Oct 20, 2020, 06:40 PM IST
    1. తెలంగాణలో అన్ని పరీక్షలు దసరా వరకు వాయిదా
    2. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటన
    3. త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని స్పష్టం
Sabitha Indra Reddy: తెలంగాణలో అన్ని పరీక్షలు దసరా వరకు వాయిదా

All Exams in Telangana are Postponed till Dassehra | తెలంగాణలో ( Telangana) ప్రస్తుతం నెలకొన్న పరిస్థితలను గమనించి అన్ని పరీక్షలను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ( Sabitha Indra Reddy) ప్రకటించారు. దసరా వేడుకలు ముగిసే వరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ట్వీట్ చేసి సమాచారం అందించారు.

పరీక్షలతో పాటు యూజీ, పీడి, ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ ( Hyderabad )లో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీతో సహా కొన్ని విశ్వవిద్యాలయాలు పరీక్షలను వాయిదా వేశాయి. 

జవహార్ లాల్ నేషనల్ టెక్నికల్ యూనివర్సిటీ ( JNTU), కాకతీయ విశ్వవిద్యాలయంలో ( Kakatiya University ) జరగాల్సిన ఎంబిఏ, డిగ్రీ సెమిస్టర్స్, బీఈడి తదితర పరీక్షలు కూడా వాయిదా వేశారు. ఆ నెల 19న, 20న జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే వాయిదాపడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామో అనేది త్వరలో ప్రకటిస్తామని సబితా రెడ్డి తెలిపారు.

Trending News