భాగ్యనగరంలో ఇంటర్ విద్యార్దిని దారుణ హత్య..

Last Updated : Sep 12, 2017, 02:14 PM IST
భాగ్యనగరంలో ఇంటర్ విద్యార్దిని దారుణ హత్య..

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగర పరిధిలోని మదీనాగూడకు చెందిన ఇంటర్ విద్యార్ది చాందినీ జైన్ ను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా సంచలం సృష్టిస్తోంది. స్నేహితులతో పార్టీ ఉందని...వెళ్లి వస్తారని చెప్పి మూడు రోజుల క్రితం ఇంట్లో చెప్పి వెళ్లిన చాందినీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ ట్రాక్ చేసి విచారిస్తుండగా అమీన్ పూర్ కొండల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసి కొండల్లో పడేశారని తేల్చిన పోలీసులు..అత్యాచారానికి గురైందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కలిసోస్తానన్న స్నేహితుడు ఎవరన్న దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అతనే హత్య చేశాడా.. లేకుండా మరెవరైనా ఈ దాడుణానికి ఒడిగట్టారా అన్న కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు..ఇదిలా ఉండగా ఛాందినీ మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

 

 

Trending News