9 నెలల చిన్నారిని హత్య చేసి, దంపతుల ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలో బుధవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తమ సొంత కూతురైన ముక్కుపచ్చలారని 9 నెలల చిన్నారిని ( Baby girl murder ) హత్య చేసిన దంపతులు ఇద్దరు అనంతరం ఆత్మహత్య ( Couple suicide) చేసుకున్నారు.

Last Updated : May 21, 2020, 02:16 AM IST
9 నెలల చిన్నారిని హత్య చేసి, దంపతుల ఆత్మహత్య

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలో బుధవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తమ సొంత కూతురైన ముక్కుపచ్చలారని 9 నెలల చిన్నారిని ( Baby girl murder ) హత్య చేసిన దంపతులు ఇద్దరు అనంతరం ఆత్మహత్య ( Couple suicide) చేసుకున్నారు. స్థానిక సీఐ శ్యాంసుందర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మన్నెగూడెంకు చెందిన రాంబాబు(27)కు చిల్కోయలపాడుకు చెందిన వైష్ణవి (24)తో 6 సంవత్సరాల క్రితమే వివాహమైంది. వీళ్లకు 9 నెలల వయసున్న ఓ కూతురు కూడా ఉంది. ( Read also : Atma nirbhar package : కేంద్రం ప్యాకేజీపై మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు )

అయితే, గత కొద్దిరోజులుగా కుటుంబ కలహాలతో వైష్ణవి తల్లిగారి ఊరైన చిల్కోయాలపాడుకి వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం అత్తగారింటికి వెళ్లిన రాంబాబు.. సాయంత్రం తన భార్య, బిడ్డతో కలిసి ద్విచక్రవాహనంపై మన్నెగూడెం బయల్దేరాడు. మార్గం మధ్యలోనే మరోసారి ఇరువురి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో తన వ్యవసాయ బావి వద్దకు వచ్చిన అనంతరం తన మరదలికి ఫోన్ చేసిన రాంబాబు.. నేను, మీ అక్క చనిపోతున్నామని ఫోన్ చేసి చెప్పాడు. చిన్నారి చైత్రికను హత్య చేసి పక్కనే ఉన్న చెరువులో పడేసిన అనంతరం భార్యాభర్తలిద్దరూ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ( Read also : విషాదాన్ని నింపిన ఈత సరదా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి )

క్షణికావేశంలో రాంబాబు, వైష్ణవి దంపతులు తీసుకున్న నిర్ణయం ఈ దారుణానికి దారితీసింది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలో ఒకేసారి ముగ్గురు మరణించడంతో మన్నెగూడెంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న డోర్నకల్ పోలీసులు ( Dornakal police station ) దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News