హైదరాబాద్‌లో దారుణం: పసిబిడ్డను నేలకేసికొట్టిన తల్లి

హైదరాబాద్‌లో అమానవీయ ఘటన చోటుకేసుకుంది.

Last Updated : Aug 28, 2018, 10:53 AM IST
హైదరాబాద్‌లో దారుణం: పసిబిడ్డను నేలకేసికొట్టిన తల్లి

హైదరాబాద్‌లో అమానవీయ ఘటన చోటుకేసుకుంది. భర్తపై కోపంతో భార్య పసిబిడ్డను నేలకేసి కొట్టింది. ఈ దారుణ ఘటన నగరంలోని మెహిదీపట్నంలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. భార్యను భర్త రోజూ అనుమానిస్తూ ఉండేవాడు. సోమవారం రాత్రి నగరంలోని మెహదీపట్నం ఫ్లైఓవర్‌ సమీపంలో గల బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై భర్త పంచాయితీ పెట్టాడు. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి గురైన భార్య... కోపం పట్టలేక తన ఒడిలో ఉన్న పసిబిడ్డను నేలకేసికొట్టింది. దాంతో ఆ పసికందుకు స్వల్ప గాయాలయ్యాయి. దగ్గరలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు అక్కడికి చేరుకుని దంపతులిద్దరిని మందలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు భార్యా, భర్తలిద్దరినీ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. పసిబిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Trending News